అక్బరుద్దీన్ వ్యాఖ్యల కలకలం

హైదరాబాద్: ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీలపై దాడికి సంబంధించి ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వివాదంలో ఇరుక్కుని ఉండగా, మరోవైపు ఆయన సోదరుడు అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధి, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధిలతో దారుస్సలామ్ గడప నాకిస్తానని అక్బర్ రంకెలు వేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతోంది. ప్రధానమంత్రి మోడితో కలిసి కాంగ్రెస్‌ను సర్వనాశనం చేసి ఆ శవాన్ని మోడితో కలిసి మోస్తానని కూడా అక్బర్ ఆ వీడియోలో అన్నారు. కాంగ్రెస్‌ను దేశమంతా వెంటాడతానని, నామరూపాలు లేకుండా చేస్తానని నిప్పులు చెరిగారు. బాబ్రీ మసీదు కూల్చివేతతో సహా దేశంలో ముస్లిమ్‌ల పేదరికానికి కాంగ్రెస్సే కారణమని అన్నారు. బీజేపీ ఆవిర్భావానికి కారణంకూడా కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. ఇందిరాగాంధి ఎక్కడా దొరకనట్లు ఇటలీ నుంచి కోడలిని తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఇందిరాగాంధి వచ్చినట్లు, సోనియా, రాహుల్ ఎమ్ఐఎమ్ ప్రధాన కార్యాలయమైన దారుస్సలామ్‌కు వచ్చి మద్దతునీయమని కోరే పరిస్థితి కల్పిస్తానని అన్నారు. గత నెల 30న జీహెచ్ఎమ్‌సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బాబానగర్‌లో నిర్వహించిన ప్రచార సభలో అక్బర్ ఈ ప్రసంగం చేసినట్లు చెబుతున్నారు.

అక్బరుద్దీన్ మొదటినుంచి వివాదాలకు మారుపేరన్న సంగతి తెలిసిందే. గతంలో 2012 డిసెంబర్‌లో అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ఒక సభలో మాట్లాడుతూ, పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే వందకోట్ల మంది హిందువులను లేపేస్తామని అనటంతోపాటు హిందువుల పండగల గురించి, దేవుళ్ళ గురించి అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆ ప్రసంగం వీడియో బయటపడటంతో ఆ వ్యాఖ్యలు బయటకొచ్చాయి. దానిపై దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అక్బర్‌ను అరెస్ట్ చేసింది కూడా. అయితే తర్వాత అధికారంలోకొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మజ్లిస్‌తో దోస్తీ కట్టటంతో ఆ కేసు మరుగున పడిపోయింది. 2011లో అక్బర్‌పై ప్రత్యర్థులు దాడిచేయగా ఆయన శరీరంలోకి రెండు బుల్లెట్లు వెళ్ళాయి…17 కత్తిపోట్లు దిగాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close