ఫరూక్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్…! టీడీపీ కోసం చాలా మందే రాబోతున్నారు..!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయడానికి వివిద పార్టీలకు చెందిన నేతలంతా వరుస పెట్టి .. రాబోతున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్.. ఫరూక్ అబ్దుల్లా.. తొలి రోజు చేసిన ప్రచారం.. హోరెత్తింది. జగన్‌ చేసిన రూ. 1500 కోట్ల ఆఫర్‌ను ఆయన బయట పెట్టడంతో కలకలం రేగింది. ఇప్పుడు వరుసగా.. అనేక మంది జాతీయ నేతలు రాబోతున్నారు. పశ్చిమబెంగాల్‌ సీఎం, ఫైర్‌బ్రాండ్‌ నాయకురాలు..మమత బెనర్జీ ప్రచారానికి వస్తున్నారు. మార్చి 31న విశాఖలో జరిగే ర్యాలీకి మమతా బెనర్జీ హాజరవుతారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్చి 28న విజయవాడలో జరిగే ఎన్నికల ప్రచారానికి వస్తారు. 31న మమత హాజరయ్యే సభకు కూడా కేజ్రీవాల్‌ వస్తున్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, మాజీ ప్రధాని దేవెగౌడలు చంద్రబాబు తరపున ప్రచారంలో పాల్గొంటారు.

కర్నాటక సరిహద్దు జిల్లాలైన అనంతపురం, కర్నూలు జిల్లాలో మాజీ ప్రధాని దేవెగౌడ ప్రచారంలో పాల్గొననున్నారు. అనంతపురం జిల్లాలో దేవెగౌడ ప్రచారం కలిసి వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక శరద్‌ పవార్‌ సైతం ఈ రెండు జిల్లాలో ప్రచారం నిర్వహిస్తారని అంటున్నారు. ఇక తేజస్వి యాదవ్‌ కూడా ఏపీలో ప్రచారానికి సై అంటున్నారు. ఇక ఏప్రిల్‌ 2న నెల్లూరులో అఖిలేష్‌ యాదవ్‌ ప్రచారం చేయనున్నారు. ఇలా జాతీయ స్థాయి నేతలంతా ఏపీలో ప్రచారానికి రెడీ అవుతున్నారు. విపక్షాల కూటమి.. ఇపుడు ఒక్క తాటిపై నడుస్తోంది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులను ఓడించడమే కాదు… కూటమిలో ఉన్న పార్టీల గెలుపు కోసం నేతలందరూ ముందుకొస్తున్నారు.

ముఖ్యంగా చంద్రబాబుతో నేతలకు ఉన్న సాన్నిహిత్యంతో పాటు కొందరు నేతలు ప్రచారానికి సై అంటున్నారు. ఏపీలో ఎన్నికలు మొదటివిడతలోనే ముగుస్తుండటంతో.. చంద్రబాబు కూడా జాతీయ స్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అయితే ఏపీలో ప్రచారం ద్వారా.. విపక్షాల బలమెంతో, ఐక్యత పవర్‌ ఏంటో బీజేపీకి తెలిసేలా చేయాలని భావిస్తున్నారు. ఏపీలో పోలింగ్‌ ముగియగానే.. దేశంపై ఫోకస్‌ పెట్టబోతున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీలకు చంద్రబాబు ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close