సోనియా, నెహ్రులపై ‘కాంగ్రెస్ దర్శన్’ లో విమర్శలు

కాంగ్రెస్ పార్టీకి ఆరాధ్య దైవాలు ఎవరంటే నెహ్రూ, ఇందిర, సోనియా, రాహుల్ గాంధీలేనని అందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవం. కనుక ఈ సందర్భంగా పార్టీకి చెందిన ఆ నలుగురి గురించి పార్టీలో నేతలందరూ గొప్పగా చెప్పుకోవడం సహజమే. వారి గొప్పదనం గురించి పార్టీ పత్రిక ‘కాంగ్రెస్ దర్శన్’లో కూడా చెప్పుకొంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ డిశంబరు 15న స్వర్గీయ సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ వర్దంతి సందర్భంగా మహారాష్ట్ర నుండి వెలువడిన ఆ పత్రికలో వెలువడిన ఒక కధనం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి షాక్ కి గురి చేసింది.

“భారత్ మొట్ట మొదటి ప్రధాని స్వర్గీయ జవహార్ లాల్ నెహ్రూ, ఆనాడు ఉపప్రధాని మరియు హోం మంత్రిగా చేసిన సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ మధ్య తరచూ భేదాభిప్రాయాలు ఏర్పడేవి. ఆ కారణంగా వారు తరచూ రాజీనామాలకు సిద్దపడేవారు. పటేల్ చాలా దూరదృష్టితో ఇచ్చిన సలహాలను నెహ్రూ కనుక పాటించి ఉన్నట్లయితే భారతదేశానికి అనేక అంతర్జాతీయ సమస్యలు నివారింపబడి ఉండేవి. అలాగే చైనాని నమ్మరాదని పటేల్ చెప్పిన మాటలను కూడా నెహ్రూ పట్టించుకోకపోవడం వలన ఆ తరువాత ఆ దేశం నుండి భారత్ అనేక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకు వెళ్ళవద్దని పటేల్ ఇచ్చిన సలహాను కూడా నెహ్రూ పట్టించుకోకపోవడం వలన నేటికీ కాశ్మీర్ ఒక రావణకాష్టంలా మిగిలి ఉంది. చివరికి టిబెట్, నేపాల్ దేశాల విషయంలో కూడా పటేల్ ఇచ్చిన సలహాలను నెహ్రూ పట్టించుకోలేదు,” అని ‘కాంగ్రెస్ దర్శన్’ పత్రికలో వ్రాసారు.

ఇదే సంచికలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తండ్రి స్టెఫానో మైనోపై కూడా విమర్శలు గుప్పిస్తూ మరో కధనం వెలువడటం విశేషం. అందులో “సోనియా గాంధీ తండ్రి ఇటాలియన్ ఫాసిస్టు సైన్యంలో ఒక మామూలు సైనికుడు. ప్రపంచ యుద్దంలో ఫాసిస్టు సైన్యం ఘోర పరాజయం పాలయింది. ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకొన్న సోనియా గాంధీ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయిపోయారు. అది కూడా పార్టీ సభ్యత్వం తీసుకొన్న 62 రోజుల్లోనే కావడం విశేషం. ఆమె ప్రధాన మంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు కానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు,” అని రెండవ కధనంలో వ్రాశారు.

కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రతిభింబించే ‘కాంగ్రెస్ దర్శన్’ పత్రికలో పార్టీ అధ్యక్షురాలి గురించి అంత చులకనగా, ఆ పార్టీకి ఆదిపురుషుడు వంటి నెహ్రూ గురించి ఈవిధంగా అనుచితంగా ప్రచురించినందుకు ముంబై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు ఆ పత్రిక సంపాదకుడు సంజయ్ నిరుపం పార్టీ అధిష్టానానికి క్షమాపణలు చెప్పారు. పార్టీ పత్రికను తనే చూస్తున్నప్పటికీ దాని రోజువారీ వ్యవహారాలు తను చూడటం లేదని కనుక పార్టీ పత్రికలో ఆ రెండు ఆర్టికల్స్ ఎవరు వ్రాసారో తనకు తెలియదని చెప్పారు. కానీ ఈ ఆర్టికల్స్ ఎవరు వ్రాసారో, ఆవిధంగా ఎందుకు వ్రాసారో కనుగొంటానని చెప్పారు. బహుశః ఎవరో ఉద్దేహ్యపూర్వకంగానే కుట్ర పన్నిఈవిధంగా చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వంత పత్రికలో నెహ్రూ అనుసరించిన విదేశీ విధానాలన్నీ తప్పు, దాని వలననే నేడు దేశానికి ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయని వ్రాయబడటంతో కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా తయారయింది. ఇంతవరకు మోడీ అనుసరిస్తున్న విదేశీ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ మొన్న మోడీ ఆకస్మికంగా లాహోర్ పర్యటనకు వెళ్లి వచ్చినందుకు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ స్వంత పత్రికలోనే ప్రచురితమయిన ఈ కధనంతో నోరు కట్టుకోవలసి వచ్చింది. అది కూడా సరిగ్గా కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవం జరిగే సమయానికి రావడంతో ఇంకా ఇబ్బందికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close