మధుప్రియ కేసులో మరో ట్విస్ట్: మధుప్రియ తండ్రి అరెస్ట్

గాయని మధుప్రియ, ఆమె భర్త శ్రీకాంత్ లకు పోలీసుల సమక్షంలో మానసిక వైద్య నిపుణులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వారిరువురూ రాజీకి సిద్దపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమస్య పరిష్కారం అయ్యిందని అందరూ భావిస్తున్న సమయంలో మళ్ళీ ఊహించని మలుపు తిరిగింది. మధుప్రియ తండ్రి పెద్ద మల్లేష్ శనివారం రాత్రి హైదరాబాద్ లోని రామంతాపూర్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ నయీం (30) అనే వ్యక్తిని తన అల్లుడు శ్రీకాంత్ గా పొరబడి దాడి చేసారు. ఆ దాడిలో నయీం తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతను ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీసులు మధుప్రియ తండ్రి మల్లేష్ మరో ముగ్గురు వ్యక్తులని మంగళవారం ఉదయం అరెస్ట్ చేసారు. ప్రస్తుతం వారి ముగ్గురిని పోలీస్ స్టేషన్ లో ప్రశ్నిస్తున్నారు. మరి కొద్దిసేపటిలో వారిని కోర్టు ముందు హాజరు పరచవచ్చునని తెలుస్తోంది.

అంతకు ముందు శ్రీకాంత్ పై కూడా మధుప్రియ బంధువులు దాడి చేయడంతో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతను కూడా వారిపై పోలీసులకు పిర్యాదు చేసాడు. ఇప్పుడు ఈ ఘటనతో అతను తన అత్తమామలపై చేస్తున్న ఆరోపణలు నిజమని అనుమానించవలసి వస్తోంది. వారికి తమ కుమార్తె  తనతో కాపురం చేయడం ఇష్టం లేదని అందుకే వాళ్ళు తమ కాపురంలో చిచ్చు పెడుతున్నారని, ఆ కారణంగానే తమ కాపురం రోడ్డున పడిందని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మధుప్రియ తండ్రి మల్లేష్ తన అల్లుడు అనుకొని పొరపాటున వేరొక వ్యక్తిపై దాడి చేయడం గమనిస్తే, ఆయనకి తన అల్లుడిపై దాడి చేయాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఆయన తిరిగి తన అల్లుడు శ్రీకాంత్ వలన తనకు ప్రాణహాని ఉందని పోలీసులకి పిర్యాదు చేయడం విశేషం.

మధుప్రియ కష్టార్జితాన్ని స్వంతం చేసుకోవాలనే దురాశతోనే అందరూ ఈవిధంగా వ్యవహరిస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భార్యాభర్తలు రాజీకి సిద్దపడుతున్నప్పుడు వారి పెద్దలు ఈవిధంగా వ్యవహరిస్తుండటం చాలా విచారకరమే. కనుక పోలీసులు ముందు వారి పెద్దలకు కౌన్సలింగ్ ఇవ్వడం అవసరమనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హతవిధీ… వైసీపీకి ఏమిటీ దుస్థితి..!?

జగన్ బస్సు యాత్ర పేలవంగా సాగుతోంది. వరుస సర్వేలు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి అధికారం దిశగా దూసుకుపోతోంది. ఏదైనా చేయాలి..? అధికారం...

ప్ర‌భాస్ టైటిల్ వాడుకొంటున్నారా?

హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. న‌భా న‌టేషా క‌థానాయిక‌. ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. ప్ర‌భాస్ ఊత‌ప‌దం 'డార్లింగ్‌'. ఈ...

ఎడిటర్స్ కామెంట్ : పాలిటిక్స్‌కు ఫేక్ వైరస్ !

" నిజమో అబద్దమో మన ప్రత్యర్థుల్ని దెబ్బ తీస్తుందనుకుంటే అది ప్రచారం చేయండి.. " అని కొన్నేళ్ల క్రితం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం...

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close