……..‘120కోట్ల జనాభా ఉన్నదేశంలో రెండు పతకాలు సాధిస్తేనే పిచ్చిగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది చాలా చిరాగ్గా అనిపిస్తోంది……’
పియర్స్ మోర్గాన్ అనే అథమ స్థాయి పాత్రికేయుడు ఇండియాని ఉద్ధేశ్యించి చేసిన కామెంట్.
…………‘మేం చిన్న చిన్న ఆనందాలను కూడా వేడుకగా జరుపుకుంటాం. కానీ క్రిెకెట్కి పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ ఇప్పటి వరకూ వరల్డ్ కప్ గెలవలేదు. అయినా వరల్డ్ కప్ ఆడుతూ ఉండడం మాకూ చిరాగ్గానే అనిపిస్తోంది……..’
వీరేంద్ర సెహ్వాగ్ అనే————–ఇండియన్ క్రికెటర్ ఇంగ్లాండ్ని ఉద్ధేశ్యించి చేసిన కామెంట్.
ఇండియన్ మీడియా, కొంతమంది జనాలు సెహ్వాగ్ని బీభత్సంగా పొగిడేశారు. కానీ ఎవ్వరూ ఉన్నతంగా ఆలోచించలేకపోయారు. ఇండియాను అవమానించేలా చెత్త కామెంట్స్ చేసింది మోర్గాన్ ఒక్కడే. మోర్గాన్ని విమర్శించడం, తిట్టడాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ మోర్గాన్ ఎలాంటి చెత్త కామెంట్స్ చేసి ఇండియన్స్ని బాధపెట్టాడో, అవే చెత్త కామెంట్స్ ఇంగ్లాండ్ గురించి కూడా చేసి ఆ దేశ పౌరులను బాధ పెట్టాలనుకోవడం దారుణం. ఆవేశంగా ఆలోచిస్తే సెహ్వాగ్ భలే కౌంటర్ వేశాడ్రా అనిపిస్తుంది. కానీ సెహ్వాగ్ కూడా మోర్గాన్ చేసిన పనే చేశాడన్నది మాత్రం వాస్తవం. దీన్ని దెబ్బకు దెబ్బ, కుక్క కాటుకు చెప్పుదెబ్బ అని అనుకోవడానికి కూడా లేదు. ఇండియన్స్ని దెబ్బ కొట్టింది మోర్గాన్ అయితే సెహ్వాగ్ మాత్రం ఇంగ్లాండ్ పౌరులను దెబ్బకొట్టాడు. వాళ్ళలో మోర్గాన్ కూడా ఒకడైతే కావచ్చు. కానీ ఇంగ్లాండ్ పౌరులందరూ ఇండియా గురించి నెగిటివ్గా కామెంట్ చేయలేదుగా. కనీసం ఇంగ్లాండ్ గవర్నమెంట్కి కూడా మోర్గాన్ స్టేట్మెంట్స్తో సంబంధం లేదు.
సెహ్వాగ్ స్టేట్మెంట్స్తో ఇండియాలో ఉన్నవాళ్ళకు ఏమీ ఇబ్బంది లేకపోవచ్చు. కానీ ఇంగ్లాండ్లో కూడా ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే వాళ్ళు ఇబ్బందిపడతారు. పియర్స్ మోర్గాన్ని పాత్రికేయుడు అని సంభోదించడానికి కూడా సిగ్గేస్తోంది. బజారు మనిషిలా మాట్లాడాడన్నది వాస్తవం. పియర్స్ని తిట్టడం కూడా తప్పు కాకపోవచ్చు. కానీ మోర్గాన్ చేసిన పనినే మనమూ చేసి ఇంగ్లాండ్ ప్రజలలో కొంతమందినైనా బాధ పెట్టడం మాత్రం ముమ్మాటికీ తప్పే.
We cherish every small happiness',
But Eng who invented Cricket,&yet2win a WC,still continue to playWC.Embarrassing? https://t.co/0mzP4Ro8H9— Virender Sehwag (@virendersehwag) August 24, 2016