వామపక్షాలకు భవిష్యత్తు లేదా?

పశ్చిమ బెంగాల్‌లో రెండవ సారి మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ చేతిలో ఘోరమైన ఓటమిపాలైన సిపిఎం వామపక్షాలకు ఇంక భవిష్యత్తు వుండదనిచాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దారుణ పరాజయం పక్కనే కేరళలో అఖండ విజయం అసాధారణ ఆధిక్యత కూడా చూడవలసిందే. కేరళలో ఎన్నికల్లో గెలిచినా అచ్యుతానందన్‌, పినరాయి విజయన్‌ మధ్య ఏదో ఘర్షణ జరుగుతుందంటే అదేమీ లేకుండానే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక పూర్తయింది. కనుక ఈ ఫలితాల తర్వాత సిపిఎంలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం వచ్చేస్తుందని కొన్ని మీడియా సంస్థలు రాస్తున్నదానికి ఆధారం లేదు. తీవ్రమైన సైద్ధాంతిక వాదోపవాదాలు జరగొచ్చు.నిష్కర్షగా చర్చించుకోవచ్చు గాని నిరుత్సాహం నిస్రృహగా మారకుండా సిపిఎం నాయకత్వం శ్రద్ద తీసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్రీకరించి పనిచేయొచ్చు.

మమతా బెనర్జీ నిర్బంధం, శారదా నుంచి నారద వరకూ నడిచిన భాగోతాలుచాలా దారుణమైనవి. వీటిని ఫ్రధాని మోడీతో సహా అందరూ విమర్శించారు. అయినా ఆమె మరోసారి గెలుపు సాధించడానికీ ప్రజాదరణేగాక కేంద్ర బిజెపి సహకారం తోడైంది. కమ్యూనిస్టు వ్యతిరేకతకు పేరుమోసిన కాంగ్రెస్‌ వాదులు కూడా ఆమెకే ఓటు వేసినట్టు కనిపిస్తుంది. ప్రజానుకూల విధానాలతో 34 ఏళ్లపాటు అవిచ్చిన్నంగా పాలించి ప్రపంచ రికార్డు స్థాపించిన వామపక్ష ప్రభుత్వంపై చివరి దశలో పొరబాట్ల కారణంగా తలెత్తిన ప్రజాగ్రహం, అసంతృప్తి ఇంకా పూర్తిగా తొలగిపోలేదని కూడా ఫలితాలు స్పష్టం చేశాయి. అప్పటి పరిపాలనా కాలంలో ప్రజలతో సంబంధాలు దెబ్బతినడం, ఇప్పుడు ప్రభుత్వ నిర్బంధం తృణమూల్‌ హత్యాకాండ కారణంగా ప్రజల్లోకి వెళ్లి పనిచేసే పరిస్థితిలేకపోవడం వంటివన్నీ వామపక్షాలను దెబ్బతీశాయి. కాంగ్రెస్‌తో కలవడం వల్లనే ఇంత నష్టం జరిగిందని వస్తున్న విమర్శలకు బెంగాల్‌ సిపిఎం నాయకుదు సూర్యకాంత్‌ మిశ్రా ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా వుంది. ఈ అవగాహనేలేకపోతే బిజెపి రెండవ స్తానంలో వచ్చేదని ఆయన సూటిగానే చెప్పేశారు. సిపిఎంకు 2014 పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇప్పుడూ కూడా 29 అసెంబ్లీ సెగ్మెంట్లే వచ్చాయని కూడా ఆయన వివరించారు. కనుక 2011తో పోల్చి బలం ఏదో తగ్గిపోయిందని చెప్పడానికి కూడా లేదు. దీనిపై లోతైన సమీక్ష జరపనున్నట్టు సిపిఎం ఆచితూచి ప్రకటించింది తప్ప తక్షణ వ్యాఖ్యలు చేయలేదు. అంత దీర్ఘకాలం పాలించి వివిధ రకాల ఎన్నికల్లో కొన్ని డజన్ల సార్లు గెలుపొందిన వామపక్ష ఫ్రంట్‌ గత కొన్నేళ్లలో ఓడిపోతున్నది గనక దాని మనుగడే వుండదన్నట్టు కొంతమంది సీనియరన ఎడిటర్లు రాయడంలో వాస్తవికత కనిపించదు. తెలుగుదేశం, కాంగ్రెస్‌ వంటిపార్టీలే వరుస ఓటముల తర్వాత కూడా బతికిబట్టకట్టినప్పుడు సిద్ధాంత బలం కార్యకర్తల సైన్యం ఆత్మ విమర్శ అలవాటు వున్న సిపిఎం వంటి పార్టీ దీంతోనే కూలిపోతుందని ఆశించడం అర్థంలేని పని. నిస్సందేహంగా ఈ సవాళ్లు తీవ్రమైనవే అయినా సమీక్షానంతరం సానుకూల కార్యాచరణతో దాన్ని అధిగమించేందుకు కమ్యూనిస్టులు ఏ విధంగా దృష్టి పెడతారో చూడాలి.

బిజెపి బ్రహ్మాండంగా పెరిగిపోతుందని చెబుతున్నా వాస్తవానికి ఈ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుగుతుంది. మమత జయ వంటి వారు బిజెపికి ఏదోలా సహకరిస్తారు. మరోవైపున వారికి కొంచెం భిన్నమైన కేజ్రీవాల్‌, నితిష్‌ కుమార్‌ నవీన్‌ పట్నాయక్‌,కెసిఆర్‌ వంటి వారు ఏం చేస్తారనే ప్రశ్న కూడా వుంది. యుపిలో ఎస్‌పి బిఎస్‌పిల పాత్ర రాజకీయ వైరుధ్యాలు కూడా వున్నాయి. ముందే చెప్పుకున్నట్టు యుపి ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో మరో దఫా రాజకీయ మధనం జరుగుతుంది.అదే 2019 లోక్‌సభ ఎన్నికలకు భూమిక ఏర్పరుస్తుంది. జయాపజయాలతో నిమిత్తం లేకుండా కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ మత రాజకీయాలను వినాశకర ఆర్థిక విధానాలను అవినీతి వ్యవహారాలను అరికట్టడంలోనే భవిష్యత్తు దాగివుంటుంది. ఆ కృషిలో వామపక్షాలు ముందే వుంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close