షర్మిలను పట్టించుకోని పార్టీలు..!

తెలంగాణలో రాజకీయపార్టీలు వైఎస్ షర్మిలను పట్టించుకోవడం లేదు. తాను పార్టీ పెట్టబోతున్నానని ఖమ్మం గడ్డ మీద ఆమె ప్రకటించారు. అంతే కాదు.. తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఆమె సభపై రాజకీయవర్గాలు ఓ కన్నేశాయి. ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందోనని పరిశీలించాయి. చివరికి…స్పందించేంత పెద్ద పార్టీ కాదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.అందుకే.. షర్మిల సభపై కొంత మంది రాజకీయ నేతలు వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారు కానీ.. పార్టీల పరంగా అయితే… నో కామెంట్ విధానాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాయి.

షర్మిల ఖమ్మం సభలో ఎక్కువగా కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. హామీలు అమలు చేయడం లేదని విరుచుకుపడ్డారు. మామూలగా ఆమె చేసిన విమర్శలకు… టీఆర్ఎస్ వైపు నుంచి దూకుడైన రిప్లయ్ రావాలి. అవసరంగా స్పందించి హైప్ ఇవ్వడం ఎందుకని టీఆర్ఎస్‌లో నిర్ణయం జరిగింది. అందరికీ అదే సమాచారం పంపారు. షర్మిల పార్టీ విషయంలో.. అనవసరంగా ఆవేశపడాల్సిన అవసరం లేదని తేల్చేశారు. దీంతో టీఆర్ఎస్ నేతలెవరూ నోరు మెదపలేదు. కాంగ్రెస్ కూడా అంతే..  బీజేపీ కూడా అంతే . అధికారికంగా స్పందించకూడదని నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్‌లో వీహెచ్… బీజేపీలో ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ మాత్రం స్పందించారు. కానీ వాటిని పార్టీ అభిప్రాయాలుగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.

షర్మిల రాజకీయ పార్టీ ఆరంగేట్రం మొత్తం ఓ ఈవెంట్‌లాగా… జరుగుతోందన్న అభిప్రాయం  రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. కృత్రిమంగా హైప్ క్రియేట్ చేసుకునేందుకు హంగామా చేస్తున్నారు కానీ…  ప్రజల్లో స్పందన లేదని… పార్టీలు నమ్ముతున్నాయి. ఖమ్మంలో ఏర్పాటు చేసిన సభకు పట్టుమని ఐదు వేల మంది కూడా రాలేదని… అంచనా వేశారు. వచ్చిన జనం కన్నా.. వాహనాలే ఎక్కువున్నాయన్న అభిప్రాయం కూడా వినిపించింది. జనసమీకరణ చేసే పార్టీ నిర్మాణం కూడా లేదని… ఆమె పార్టీ మొదట్లోనే తేలిపోయిందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే స్పందించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close