తుని కాపు సభలో మార్పులేదు “ఇది కాలయాపన ఎత్తుగడే”

కాపులను బిసిలలో చేర్చడానికి కమీషన్ ను నియమించాలన్న రాష్ట్రమంత్రి వర్గనిర్ణయం కాలయాపన ఎత్తుగడగానే ముద్రగడ పద్మనాభం మద్దతుదారులు నమ్ముతున్నారు. పద్మనాభం పిలుపు మేరకు తునిలో జనవరి 31 న జరిగే కాపు మహాసభ లో ఏమార్పూ లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఏ రాజకీయపార్టీలోనూ లేని ప్రజానాయకుడు ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్ పై ఆ వర్గం నాయకులు మేధావులతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. రాజకీయంగా అధికారంలోకి వస్తే కాపు సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న సూచనలను ముద్రగడ తిరస్కరించారు.” ఇందువల్ల అధికారంలోకి వచ్చిన వారు, వారి ప్రభావం పడే మరికొందరు ఎదుగుతారేమోకాని కాపుల్లో పేదలు పేదలుగానే వుండిపోతారు. సామాజికంగా ఆర్ధికంగా కాపులు ఎదగాలంటే రాజకీయపరమైన సర్దుబాట్లు కాక రాజ్యాంగ పరంగా చట్టబద్ధమైన హక్కులు సాధించవలసిందేనని” నిర్ధారించుకున్నాకే ఆయన కాపు మహాసభకు జనవరి 31 ముహూర్తంగా నిర్ణయించారు.

సంక్రాంతి తర్వాత పొలం పనులు అయిపోతాయి కనుక వ్యవసాయరంగంలో వున్న బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాల వారంతా పాల్గొనడానికి వీలుగా సభకు ఆ తేదీని నిర్ణయించారు. చంద్రబాబు పాదయాత్ర సమయంలోనూ, 2014 ఎన్నికల ప్రచార సభల్లోనూ కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయించుకోవడమే మహాసభ ఎజెండా. కాపులను బిసిల్లో చేర్పించుకోవడం, వీరి సంక్షేమానికి ఏటా 1000 కోట్లరూపాయలు ఖర్చు చేయించుకోవడం తప్ప
మరో డిమాండు లేదు ” ఇలా రోడ్డున పడటం ఏ రాజకీయపార్టీకీ, ఏకులానికీ వ్యతిరేకం కాదు. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తే పుట్టగతులు వుండవు” అంటున్నారు ముద్రగడ.

ముద్రగడ పద్మనాభం మిత భాషి. ముందే క్షుణ్ణంగా చర్చించుకుని, ఆలోచించుకుని, కార్యక్రమాన్ని సిద్ధం చేసుకుంటారు. ఆమేరకు పోస్టర్లు, పాంప్లెట్లు సిద్ధమౌతాయి. విలేకరుల ప్రశ్నలకు ఆయన సహాయకులు ఆ మెటీరియల్ నే చేతికందిస్తారు. విషయం స్పష్టంగా వుంటుంది కనుక అడగడానికి ఏమీ వుండదు.

మహాసభకు ముద్రగడ పిలుపు ఇచ్చినప్పటి నుంచీ రాష్ట్రం నలుమూలల నుంచీ బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాల వారు, ఆయన అభిమానులు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని కిర్లంపూడిలో ఆయన నివాసానికి వెళ్ళి మద్దతు ప్రకటించి వెళుతున్నారు. ఈ సందర్శకులు తక్కువలో తక్కువ రోజుకి 100 మందైనా వుంటున్నారు. వీరిలో మోటారు బైకు మీద వచ్చే యువకులు నడి వయసులో ప్రవేశిస్తున్న వారే అధికం!

ముద్రగడ వంటివారి వల్ల ఆతిధ్యానికి తూర్పుగోదావరి జిల్లా పేరుపడిందో, తూర్పు గోదావరి జిల్లా అతిధి మర్యాదల సాంప్రదాయాన్ని ముద్రగడ పాటిస్తున్నారో తెలియదుగాని ఆయన నివాసానికి వెళ్ళిన వారందరికీ మసాలా ఉప్మా వడ్డిస్తారు. ఇది భోజనానికి ఏమాత్రం తక్కువ కాదు. ఆహార సదుపాయం లేని ఆ చిన్న గ్రామంలో ఇలాంటి ఏర్పాటు అవసరమే మరి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close