‘నేతాజీ’ దస్త్రం పేలని అస్త్రమే

Telakapalli-Raviదేశం ఎంతగానో ఆరాధించే ఆదర్శ వీరుడు నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ ప్రమాద మరణం నిజమేనని కేంద్రం యాభయ్యవ దశకంలోనే అధికారికంగా ధృవీకరించింది. ప్రధాని నరేంద్ర మోడీ విపరీత ప్రచారంతో విడుదల చేసిన తొలివిడత ఫైళ్లు రాజకీయంగా బిజెపికి ఏ మాత్రం ఉపయోగపడేవిగా లేవు. అసలు ఈ ఫైళ్లలో కొత్తగా బయిటపడేది శూన్యమని ఇంగ్లీషు మీడియా గానీ, నిపుణులు గానీ ముందే చెప్పేశారు. నా వరకు నేను ఈ విషయమై చాలా సార్లు వ్యాఖ్యానం రాశాను. నేతాజీని గౌరవించడం వేరు, ఆయన గురించిన నిరాధార కథనాలకు విశ్వనీయత కల్పించడం వేరు. కొన్ని రాజకీయ శక్తులు అధికార వర్గాలు స్వార్థం కోసం ఆయన చుట్టూ కాల్పనిక కథలు సృష్టించి పబ్బం గడుపుకుంటూ వచ్చాయి.కమిషన్లు విచారణలు పర్యటనలు అన్నీ సాగించడమే గాక దాన్ని ఒక విధమైన బ్లాక్‌ మెయిలింగ్‌ సాధనంగా వాడుకున్నాయి. మరణంపై మిస్టరీ తేలలేదని పదేపదే చెప్పేవారు అసలా మిస్టరీ ఏమిటో ఎలా వచ్చిందో చెప్పాలి కదా? ప్రమాదం అబద్దమని బతికి వున్నప్పుడు చూశామని సాక్ష్యమిచ్చిన వారు లేరు. ఎవరో ఎవరికో ఏదో చెబితే తమకు వారు చెప్పారన్నట్టు మాట్లాడేవారి కథనాల ఆధారంగా ఒక చారిత్రిక మహాపురుషుడి మరణాన్ని ప్రకటించలేకపోవడం బాధాకరం.

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో రాజకీయ లబ్డికోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో విడుదల చేసిన 64 ఫైళ్లలోనూ ఒక్కటంటే ఒక్క ముక్క కొత్తగా వెల్లడి కాలేదు. ఇక ఇప్పుడు మోడీ బయిటపెట్టిన వాటిలోనూ కొత్తసమాచారం లేదు.

నెహ్రూకు తద్వారా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారానికి ఈ ఫైళ్లు అక్కరకు వస్తాయనుకుంటే కొద్దోగొప్పో అవతలివారికే అనుకూలంగా వుండటం బిజెపికి మింగుడు పడని విషయం.ఉదాహరణకు నేతాజీ మరణం తర్వాత జర్మనీలోని ఆయన భార్యకు పెన్షన్‌ ఇప్పించేందుకు నెహ్రూ కృషి చేశారని ఒక లేఖ చెబుతున్నది. జపాన్‌లోని ఒక దేవాలయంలో భద్రపరచిన నేతాజీ చితాభస్మాన్ని తెప్పించి నదుల్లోనిమజ్జనం చేయడానికి నిరాకరించినట్టు కూడా మరో ఫైలు చెబుతున్నది. ఆ చితాభస్మం తెప్పించేట్టయితే నేతాజీ మరణం నిజమనే అభిప్రాయాన్ని రుద్దినట్టవుతుంది గనక వద్దని ఆపేశారు. అంటే ఈ విషయంలో కేంద్రం సున్నితంగా వున్నట్టే అనుకోవాలి.
ఈ ఫైళ్లలో రాజకీయ వివాదానికి దారి తీసేది ఒకటే వుంది. నేతాజీని యుద్ధ నేరస్తుడుగా ప్రస్తావిస్తూ నెహ్రూ బ్రిటిష్‌ ప్రధాని అట్లీకి రాసినట్టు చెప్పబడుతున్న లేఖ అనుమానాస్పదమైంది. బ్రిటిష్‌ వారి దృష్టిలో నేతాజీ యుద్ధ ఖైదీ అనే అర్థంలో వున్న ఆ లేఖపై నెహ్రూ సంతకం కూడా లేదు. పైగా నేతాజీ రష్యాకు వెళ్లాడని నెహ్రూ ఆ లేఖలో ధృవీకరించి రాయడం నెహ్రూ వంటి అనుభవజ్ఞుడు చేసే ప్రసక్తి వుండదు. ఇంత కీలకమైన క్లిష్టమైన సమస్యలో సంతకం లేని లేఖను నెహ్రూ లాటి నాయకుడికి అందులోనూ తొలి ప్రధానికి ఆపాదించడం చెల్లుబాటయ్యేది కాదు. ఒక స్టెనోగ్రాఫర్‌ ఈ లేఖను టైపు చేసినట్టు నేతాజీ బంధువు ప్రదీప్‌ బోస్‌ 1999లో వాజ్‌పేయి ప్రభుత్వానికి లేఖ రాశారు. నిజానికి ఆ స్టెనో గ్రాఫర్‌ రాసింది వేరే లేఖ. ఈ కారణంతోనే కాంగ్రెస్‌ మోడీ ప్రభుత్వ ఉద్దేశాలపై సందేహం వ్యక్తం చేసింది.

కాంగ్రెస్‌ను చాలా విషయాలకు విమర్శించాల్సి వుంటుంది. కాని ఆనాటికి తిరుగేలేని నెహ్రూ తన నాయకత్వానికి చిక్కుగా వుంటాడనే భయంతో నేతాజీని రానివ్వలేదని ఇంకా చెప్పాలంటే చంపించేశారనీ ఆరోపించడం వూహకందని కట్టుకథ. అప్పటి సోవియట్‌ నేత స్టాలిన్‌కు నెహ్రూ అంటే అంత గొప్ప అభిప్రాయం అనుబంధం ఏమీ లేవు. నేతాజీ కుటుంబంపై ఎందుకు నిఘా వేశారన్నది మాత్రం కాంగ్రెస్‌ సమాధానం చెప్పుకోవలసిన విషయమే. ఆయన గురించిన సమాచారం తెలుసుకోవడానికే అని సమాధానం వస్తే దానికీ ఆశ్చర్యపోకూడదు. దేశంలో అనేక సమస్యలు వుండగా వాటిని వదలిపెట్టి ఏడు దశాబ్దాల కిందట మరణించిన నేతాజీ గురించి లేనిపోని కథనాలతో సమయం వృథా చేయడం అర్థం లేని పని. ఇది పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలలో బిజెపికి ఉపయోగపడుతుందన్న ఆశ అంతకంటే హాస్యాస్పదం. ఈ ఫైళ్ల విడుదల తర్వాత నేతాజీ మరణవివాదం నెమ్మదిగా వెనక్కుపోవచ్చు. కుటుంబ సభ్యులు కూడా అధికారికంగా ఏదో ఒకటి ప్రకటించాలనే కోరుతున్నారు. నిఘాకు సంబంధించిన నిజానిజాలు చెప్పాలంటున్నారు. ఈ రెండు పనులూ చేస్తే నేతాజీకి నివాళులర్పించి ముందుకు పోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close