గోపీచంద్ బ‌తికిపోయాడా??

క‌థల విష‌యంలో ఆచి తూచి స్పందిస్తుంటాడు గోపీచంద్‌. త‌న జ‌డ్జిమెంట్‌పై జ‌నాల‌కు గురి ఎక్కువే. అదే మ‌రోసారి రుజువైంది. తాను ‘నో’ చెప్ప‌డం వ‌ల్ల ఓ ఫ్లాప్ నుంచి త‌ప్పించుకొన్నాడు. సుశాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘ఆటాడుకుందాం రా’ ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ సినిమా డిజాస్ట‌ర్ లిస్టులో చేరిపోయింది. క‌థ‌లో కొత్త‌ద‌నం లేద‌ని, వినోదంలో ప‌స లేద‌ని విశ్లేష‌కులు తేల్చేస్తున్నారు. దాంతో సుశాంత్ ఖాతాలో మ‌రో ఫ్లాప్ చేరిపోయిన‌ట్టైంది. నిజానికి ఈ ఫ్లాపు గోపీచంద్‌కి త‌గ‌లాల్సింది. ఎందుకంటే ఈ క‌థ ముందు గోపీచంద్ ద‌గ్గ‌ర‌కే వెళ్లింది.

లౌక్యం త‌ర‌వాత శ్రీ‌ధ‌ర్ సిపాన కు ద‌ర్శ‌కుడిగా ఛాన్స్ ఇవ్వాల‌ని గోపీచంద్ డిసైడ్ అయ్యాడు. భ‌వ్య ఆర్ట్స్ సంస్థ శ్రీ‌ధ‌ర్‌కి అడ్వాన్సు కూడా ఇచ్చింది. కొంత‌కాలం ఇదే స్క్రిప్టుతో గోపీచంద్ వెంట తిరిగాడు శ్రీ‌ధ‌ర్‌. అయితే… ఎందుక‌నో ఈ క‌థ‌ని గోపీచంద్ ప‌క్క‌న పెట్టాడు. ‘నాకోసం మ‌రో క‌థ చెప్పు.. అప్పుడు చేద్దాం’ అన్నాడ‌ట‌. లేదంటే ఈక‌థ‌ని మ‌రో హీరోతో భ‌వ్య ఆర్ట్స్ లోనే చేసుకో అని ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. ఆ క‌థ అటు తిరిగి ఇటు తిరిగి సుశాంత్ ద‌గ్గ‌ర చేరింది. ఈ చిత్రానికి ముందు అనుకొన్న ద‌ర్శ‌కుడు శ్రీ‌ధ‌రే. అయితే జి.నాగేశ్వ‌రెడ్డితో సుశాంత్‌కి క‌మిట్‌మెంట్స్ ఉండ‌డం వ‌ల్ల‌.. డైరెక్ష‌న్ ఛాన్స్ మిస్స‌య్యింది. ఈ క‌థ‌కు నో చెప్పి గోపీచంద్ మంచి ప‌నే చేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close