ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ని రేపు విడుదల చేయాలనుకుంది చిత్రబృందం. అయితే ఇప్పుడు ట్రైలర్ కాస్త ఆలస్యంగా వస్తోంది. ఈనెల 21న ఈ ట్రైలర్ని విడుదల చేస్తారు. ట్రైలర్ని 16న, ఆడియోని 21న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే… చివరి నిమిషాల్లో ఈ షెడ్యూల్ మారింది. ఆడియోతో పాటే ట్రైలర్నీ చూపించాలని ఎన్టీఆర్ టీమ్ డిసైడ్ అయ్యింది. అయితే ఆడియో వేదిక కూడా మారే అవకాశాలున్నాయి. నిమ్మకూరులో పాటల్ని విడుదల చేయాలని చిత్రబృందం ముందుగా భావించింది. అయితే… ఇప్పుడు ఆ వేదిక మారుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆంద్రాలో తుఫాను వాతావరణం కనిపిస్తోంది. అనుకున్న సమయానికి వేదిక సిద్ధం కాకపోవొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో.. ఆడియో వేదికపై ఓ క్లారిటీ వస్తుంది.