జనతా గ్యారేజ్……ఎన్టీఆర్‌కి చాలా పెద్ద సమస్యనే తెచ్చిపెట్టిందిగా

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటి? కెరీర్‌లో ఎప్పుడూ కూడా ఒక సినిమా పూర్తయ్యేలోపే తర్వాత సినిమాను లైన్‌లో పెట్టే ఎన్టీఆర్… ఈ సారి ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నాడు? దానికి ప్రధాన కారణం జనతా గ్యారేజ్ సినిమా కలెక్షన్సే అని తెలుస్తోంది. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించి పెట్టిన ‘జనతా గ్యారేజ్’ కంటే ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొట్టే సినిమానే చేయాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయి ఉన్నాడు. కానీ సరైన డైరెక్టర్ ఎవ్వరూ ఎన్టీఆర్‌కి అందుబాటులో లేరు. తనకు బాగా ఇష్టమైన రాజమౌళి, వినాయక్, సుకుమార్ లాంటి వాళ్ళు… వాళ్ళ సినిమాలతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా బిజీ. లింగుస్వామి కూడా బన్నీతో ఫిక్స్ అయిపోయాడు. ఇక ఎన్టీఆర్‌కి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ పూరీ జగన్నాథ్. అలాగే పూరీకి కూడా ఇప్పటికిప్పుడు డేట్స్ ఇచ్చే స్టార్ హీరో ఎవ్వరూ లేరు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్‌తో చేస్తున్న ఇజం సినిమాను పూర్తి చేసేశాడు పూరీ. పూరీ జగన్నాథ్ చెప్పిన లైన్ కూడా ఎన్టీఆర్‌కి నచ్చిందని చెప్తున్నారు. మరి సమస్య ఏంటి?

ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. వరుస ఫ్లాప్స్‌తో, కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత డౌన్‌లో ఎన్టీఆర్ ఉన్నప్పుడు ‘టెంపర్‌’లాంటి మంచి హిట్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. ఎన్టీఆర్ ఇమేజ్‌ని కూడా మార్చగలిగాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఆ సక్సెస్ క్రెడిట్‌ని ఎక్కువ శాతం వక్కంతం వంశీ అకౌంట్‌లో వేస్తున్నాడు. ఒక్క టెంపర్ సినిమాను పక్కన పెడితే పూరీ జగన్నాథ్ తీసిన లాస్ట్ హిట్ సినిమా ఏది అంటే ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. అందుకే పూరీ జగన్నాథ్ చెప్తున్న కథలను నమ్మే పరిస్థితులలో లేడు ఎన్టీఆర్. అలాగని వక్కంతం వంశీని కథ ఇవ్వమంటే… ఆయనేమో డైరెక్షన్ కూడా కావాలంటున్నాడు. ఇప్పుడున్న స్టేజ్‌లో ఓ కొత్త డైరెక్టర్‌తో సినిమా అంటే ప్రి రిలీజ్ బిజినెస్ రేంజ్ పడిపోతుంది. ఆ తర్వాత సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా కూడా ‘జనతా గ్యారేజ్’ కలెక్షన్స్ క్రెడిట్ మొత్తాన్ని కొరటాల శివ అకౌంట్‌లో వేసేస్తారు క్రిటిక్స్. పైగా ఇప్పుడు ఎన్టీఆర్‌ని విమర్శించడానికి పనిగట్టుకుని కూర్చున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అని పూరీ జగన్నాథ్ సొంత కథ అంటే కూడా డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్‌ ఎవ్వరూ కూడా క్రేజీ అమౌంట్స్‌తో ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఎన్టీఆర్ చాలా పెద్ద కన్ఫ్యూషన్‌లో ఉన్నాడని తెలుస్తోంది. బ్యాంకాక్ వెళ్ళి కొన్ని రోజుల పాటు రెడీ చేసి, తీసుకొచ్చి వినిపించిన పూరీ వంటకం కూడా ఎన్టీఆర్ అండ్ టీంకి అంతగా నచ్చలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ తీసుకోబోయే నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close