పుష్కర మృతులపై న్యాయ విచారణ – అధికారుల సహాయ నిరాకరణ

గోదావరి పుష్కరాలు మొదలైన రోజున జరిగిన తొక్కిసలాటపై న్యాయవిచారణకు అధికారులు సహకరించడం లేదు. కమీషన్ కి సాక్షులు అందజేసిన అఫిడవిట్లపై మార్చి 19 నాటికి వివరణలు ఇవ్వాలని జస్టిస్ సోమయాజులు నెలక్రితమే అదేశించారు. అయితే ఇందుకు మరో రెండు వారాలు గడువు కావాలని అధికారుల తరపు న్యాయవాది రాజమహేంద్రవరంలో విచారణ జరుపుతున్న కమీషన్ ను కోరారు. ఈలోగానే మార్చి 28న విచారణ కమీషన్ గడువు ముగుస్తుంది. కమీషన్ గడువుని పొడిగిస్తేతప్ప ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగే అవకాశం లేదు.

గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవం రోజున పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 28మంది మరణించారు. దీనిపై న్యాయవిచారణకు రాష్ట్రప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సి వై సోమయాజులు తో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. జస్టిస్ సోమయాజులు కమిషన్ గత ఫిబ్రవరి 23న విచారణ నిర్వహించినపుడే, సాక్షులు దాఖలుచేసిన అఫిడవిట్లపై మార్చి 19లోపు తమ వివరణను దాఖలుచేయాలని ఆదేశించారు.

కమిషన్ ఆదేశాల మేరకు సాక్షులు తమ అఫిడవిట్లను 5లోపు దాఖలుచేశారు.పెద్ద యంత్రాంగం, ప్రత్యేక వ్యవస్థ ఉన్నప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం తమ వివరణను దాఖలుచేయకపోవటం ఆశ్చర్యకరంగా వుంది.

తొక్కిసలాట సంఘటనకు కారకులైన అధికారులే న్యాయవిచారణకు సహకరించటం లేదని, అందువల్ల కమిషన్ ఆదేశాలను నిర్లక్ష్యంచేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేసారు. తొక్కిసలాట సంఘటన జరిగినపుడు కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారులను బదిలీచేస్తే తప్ప న్యాయవిచారణ ముందుకు సాగదని, మరో 6 నెలలు రాష్ట్ర ప్రభుత్వం గడువు ఇచ్చినాగానీ, ఇదే అధికారులు కొనసాగితే న్యాయవిచారణ కంటి తుడుపు చర్యగానే మిగులుతుందన్నారు.

సిపిఐ నాయకుడు నల్లారామారావు ఏక సభ్య కమిషన్ గడువు పొడిగించాలని కోరారు. సాక్షులు చెప్పిన విషయాలను రాష్ట్రప్రభుత్వానికి తెలియచేయాలని, కమిషన్ గడువు పొడించాల్సిన అవసరాన్ని రాష్ట్రప్రభుత్వానికి వివరించాలని జస్టిస్ సోమయాజులు కమిషన్‌ను నల్లా రామారావు కోరారు. సిపిఎం నాయకుడు టి అరుణ్ మాట్లాడుతూ కమిషన్ గడువు ముగుస్తున్నా ఇంకా రెండు వారాలు గడువు కావాలని కోరటం సరికాదన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close