‘ఒక్క క్ష‌ణం’… ఒక్క‌డు టైపు స్టోరీ అట‌!

గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో మ‌హేష్ బాబు న‌టించిన ‘ఒక్క‌డు’ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేం. మ‌హేష్ కెరీర్‌లో అదో మైల్ స్టోన్‌. స్క్రీన్ ప్లే ప‌రంగా.. ఆ సినిమా కొత్త‌గా అనిపిస్తుంది. ఓ అమ్మాయిని కాపాడ్డానికి.. ఓ అబ్బాయి చేసే ప్ర‌య‌త్నం, సాహ‌సం… ఆ క‌థ‌. ఇప్పుడు ఇదే త‌ర‌హా క‌థ‌లో అల్లు శిరీష్ క‌నిపించ‌బోతున్నాడు. శిరీష్ క‌థానాయ‌కుడిగా వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ‘ఒక్క క్ష‌ణం’. సీర‌త్ క‌పూర్‌, సుర‌భి క‌థానాయిక‌లుగా న‌టించారు. ఈ క‌థ ‘ఒక్క‌డు’ని పోలి ఉంటుంద‌ట‌. సుర‌భి ఓ పెను ప్ర‌మాదంలో ఇరుక్కుపోతుంద‌ని, ఆ ప‌ద్మ‌వ్యూహం నుంచి కాపాడ‌డానికి శిరీష్ చేసే ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా అని తెలుస్తుంది. వీఐ ఆనంద్ స్క్రీన్ ప్లే వినూత్నంగా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇదో థ్రిల్ల‌ర్ అని, ‘క్ష‌ణం’ త‌ర‌హా ట్విస్టు కూడా ఈ సినిమాకి ప్ల‌స్ అవుతుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా బిజినెస్ మొద‌లైంది. ఆంధ్రా హ‌క్కుల్ని ఫ్యాన్సీ రేటుకు అమ్మేశారు. ప్ర‌మోష‌న్లు కూడా భారీగా చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఇంట్లో మెగా హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్లంతా త‌లో చేయి వేస్తే.. ఈ సినిమాకి ప్ర‌మోష‌న్లు భారీ ఎత్తున జ‌రిగిపోతాయి. మ‌రి అల్లు శిరీష్ జాత‌కం ఎలా ఉందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.