అమ్మవారి మొక్కు తీరింది…

లాల్ దర్వాజ మహంకాళి ఆలయం. హైదరాబాద్ లో చాలా మందికి దర్శనీయ స్థలం. ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధుకు కూడా ఈ అమ్మవారిపై భక్తి ఎక్కువ. పతకం సాధించిన సంతోషంలో శనివారం ఉదయం అమ్మవారికి మొక్కు చెల్లించుకుంది సింధు.

ప్రతి ఏడాది ఈ ఆలయాన్ని సందర్శించడం సింధుకు అలవాటు. ఒలింపిక్స కు వెళ్లడానికి ముందు బోనాల పండుగ సందర్భంగా కూడా సింధు లాల్ దర్వాజ వెళ్లింది. మహంకాళి ఆలయాన్ని దర్శించుకుంది. అమ్మవారికి బోనం సమర్పించింది. రియోలో పతకం గెలిస్తే మళ్లీ వస్తానని అమ్మవారికి మొక్కుకుందట. అందుకే, మరోసారి వచ్చి మొక్కు చెల్లించింది.

ప్రస్తుతం ఒలింపిక్ విజయానందాన్ని ఆస్వాదిస్తోంది. సింధు. ఇంటర్ వ్యూలు, ఆటో గ్రాఫ్ లు, ఫొటోగ్రాఫ్ లు, ఆత్మీయ పలకరింపులు, మెమొంటోల బహూకరణలు. అంతా కొత్త కొత్తగా ఉంది. ఆమె బ్రాండ్ ఇమేజి కూడా అమాంతం పదిరెట్లు పెరిగింది.

ఒలింపిక్ పతక విజేతగా సింధుకు ఇప్పటికే వివిధ ప్రభుత్వాలు ప్రకటించిన నజరానాల మొత్తం 10 కోట్ల రూపాయలకు పైమాటే. వీటికి ఇళ్ల స్థలాలు అదనం. ఇప్పుడు ఆమె బ్రాండ్ విలువ 2 కోట్లని తాజా లెక్కలు చెప్తున్నాయి. ఆమె బ్రాండ్ అంబాసిడర్ అవుతానంటే అనేక కంపెనీలు క్యూ కట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్క విజయం సింధు జీవితాన్నే మార్చేసింది. ఆమె ఇన్నేళ్ల శ్రమకు ఇప్పటికి ఫలితం దక్కింది. దేశానికి తన వంతుగా ఓ ఒలింపిక్ పతకాన్ని సాధఇంచి పెట్టింది. తద్వారా ఆమెకు ఆర్థికంగానూ కలిసివస్తోంది. ఇక టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close