ఆ ఉస్మాన్ మావోడు కాడు లష్కరోడు: పాకిస్తాన్

జమ్మూలో ఉదంపూర్ వద్ద సరిహద్దు భద్రతా దళాల మీద దాడి చేసి పట్టుబడిన మొహమ్మద్ నవెద్ అలియాస్ ఉస్మాఖాన్ ఏమాత్రం జంకు గొంకు లేకుండా తాము పాకిస్తాన్ నుంచి భారత్ లోకి ఏవిధంగా ప్రవేశించారో, ఎక్కడెక్కడ మజిలీలు చేసారో, పాకిస్తాన్ లో తను ఎక్కడ శిక్షణ తీసుకొన్నాడో వగైరా అన్ని వివరాలు పూసగుచ్చి చెపుతున్నాడు. ఇది వరకు ముంబై లో దాడులకు పాల్పడి అనేకమంది ప్రజలను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపిన పాక్ ఉగ్రవాది అజ్మల్ కసాబ్ పట్టుబడినప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం అతను తమ దేశపౌరుడు కాడని బుకాయించింది. కానీ ఆ తరువాత సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన తరువాత అంగీకరించక తప్పలేదు. మళ్ళీ ఇప్పుడు ఉస్మాన్ ఖాన్ విషయంలో కూడా అలాగే బుకాయిస్తోంది.

అటువంటి పేరుగల వ్యక్తి ఎవరూ తమ పౌరుల జాబితాలో లేరని ‘పాకిస్తాన్ జాతీయ డాటాబేస్ మరియు రిజిస్ట్రేషన్ అధారిటీ ‘దున్యా న్యూస్’ అనే పాకిస్తాన్ వెబ్ సైట్ కి తెలియజేసింది. బహుశః అతను లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకి చెందిన వ్యక్తి అయ్యి ఉండవచ్చని తెలిపింది. ఉస్మాన్ ఖాన్ కూడా తను పాకిస్తాన్ లో ఫైసలాబాద్ తన స్వస్థలమని, లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థలో శిక్షణ పొందానని చెపుతున్నాడు. అటువంటపుడు అతను ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తేనని ఒకపక్క దృవీకరిస్తూనే మళ్ళీ అతను తమ పౌరుడు కాదని పాకిస్తాన్ చెప్పడం హాస్యాస్పదం.

ఒక ఉగ్రవాది తమ దేశస్థుడని ఒప్పుకొంటే ఆ ఉగ్రవాదిని తయారు చేసింది, భారత్ పై దాడికి పంపింది కూడా తామేనని అంగీకరించినట్లవుతుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశంగా పాక్ పేరొందింది. ఇప్పుడు ఉస్మాన్ ఖాన్ తమవాడేనని ప్రకటిస్తే అదే విషయం మరొక సారి దృవీకరించినట్లవుతుంది. అందుకే అతను తమ పౌరుడు కాదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. ప్రజల ప్రాణాలు బలిగొంటున్న ఒక ఉగ్రవాదిని తమ పౌరుడని చెప్పుకోవడానికే సిగ్గు పడుతున్నప్పుడు ఉగ్రవాదాన్ని ఎందుకు పోషించడం? ప్రపంచ దేశాల ముందు ఎందుకు సిగ్గుతో తల దించుకోవడం?

క్రిందటి సంవత్సరంలో ఒకసారి లష్కర్ ఉగ్రవాదులు ఇస్లామాబాద్ లో ఒక మిలటరీ స్కూల్లో ప్రవేశించి సుమారు 140 మంది అభం శుభం తెలియని విద్యార్ధులను వారి తరగతి గదుల్లోనే వరుసగా నిలబెట్టి అతి కిరాతకంగా కాల్చి చంపినప్పుడు ఒక్క పాకిస్తాన్ దేశమే కాదు భారత్ తో సహా యావత్ ప్రపంచ దేశాలు కన్నీరు కార్చాయి. “ఉగ్రవాదులలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటూ వేరే ఉండరని, ఉగ్రవాదులు ఎవరయినా నరహంతకులేనని” అప్పుడు పాకిస్థా ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా చెప్పుకొన్నారు. ఇక పాక్ గడ్డపై ఉగ్రవాదం అనేది లేకుండా చేస్తామని భీకర శపథం చేసి ఓ 50-60మంది ఉగ్రవాదులను ఉరి తీశారు కూడా.

కానీ ఏడాది తిరక్కుండానే అదంతా మరిచిపోయి మళ్ళీ యధాప్రకారం లష్కర్ ఉగ్రవాదులు తమ గడ్డపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే చేతులు ముడుచుకొని చూస్తోంది. ఉస్మాన్ ఖాన్ తమ దేశ పౌరుడు కాడని పాక్ సర్దిచెప్పుకోవడం బాగానే ఉంది. కానీ అదే సమయంలో అతను లష్కర్ ఉగ్రవాది అయ్యుండవచ్చునని చెప్పిన మరోముక్క తమ గడ్డపై నేటికీ ఉగ్రవాదుల శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని దృవీకరిస్తున్నట్లుంది.తమ స్వంత పిల్లలే ఉగ్రవాదానికి బలయిపోయినా కూడా పాక్ ప్రభుత్వానికి ఇంకా బుద్ది రాలేదు…మారలేదు..ఇక ఎన్నటికీ కూడా మారబోదని పాక్ ప్రకటనతో మరోమారు స్పష్టం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close