కాపు కార్పొరేషన్ నిధులపై శ్వేతపత్రం కోరుతున్న పవన్..!

కాపు కార్పొరేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న లెక్కల మ్యాజిక్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. అందరికీ ఇచ్చే పథకాల్లో భాగంగా ఇచ్చే మొత్తాన్ని కూడా కార్పొరేషన్ ఖాతాలో వేసి లెక్కలు చెప్పడంపై ఆయన మండిపడ్డారు. కాకి లెక్కలు చెబుతూ.. కాపుల్ని మోసం చేస్తున్నారన్న పవన్.. తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తే.. తాము రూ. రెండు వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించి వైసీపీ అధికారంలోకి వచ్చిందని పవన్ గుర్తు చేశారు. గత 13నెలల కాలంలో 4700 కోట్లు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ నిధులను అందిరతో పాటు ఇచ్చారా.. కాపుల కోసం ప్రత్యేకంగా ఇచ్చారా చెప్పాలని డిమాండ్ చేశారు.

కాపు కార్పొరేషన్ విషయంలో ఏపీ సర్కార్ వ్యవహారశైలి… ఆ వర్గం నేతల్లో.. ప్రజల్లో అసంతృప్తికి కారణం అవుతోంది. కార్పొరేషన్ అనేది.. ప్రత్యేకం. దానికి కేటాయించే నిధులు. ఆ వర్గం యువత ఉపాధికి.. ఉపయోగపడేలా.. రుణాలు ఇవ్వాలి. కానీ ఏపీ సర్కార్ వృద్ధులకు ఇచ్చే సామాజిక పెన్షన్ల దగ్గర్నుంచి అమ్మఒడి వరకూ ..అందరికీ ఇచ్చే పథకాలను.. ఆ కార్పొరేషన్ కిందనే ఇస్తున్నట్లుగా ప్రకటిస్తోంది. దాంతో.. అసలు కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి కూడా.. కేటాయిస్తున్నారో లేదో తెలియడం లేదు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున కాపు కార్పొరేషన్ కింద రుణాలు.. స్వయం ఉపాధి యూనిట్లు మంజూరుయ్యాయి. ఈ ప్రభుత్వంలో అలాంటివేమీ లేవు. సామాజిక పెన్షన్లు.. అమ్మఒడి నిధులను కాపు కార్పొరేషన్ కింద ఇస్తున్నట్లుగా ప్రకటిస్తున్నారు.

ప్రభుత్వం చేస్తున్న ఈ మాయ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. ప్రభుత్వం కాపుల్ని ఘోరంగా మోసం చేస్తుందని అంచనా వేసుకుని పోరుబాట పట్టారు. తక్షణం కాపు కార్పొరేషన్ కు ఇస్తున్న నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చేసుకుటున్న ప్రచారం వల్ల కులాల మధ్య చిచ్చు రేగే ప్రమాదం ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

సంయుక్త‌కు బాలీవుడ్ ఆఫర్‌

భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్‌, విరూపాక్ష‌.... ఇలా తెలుగులో మంచి విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకొంది సంయుక్త మీన‌న్‌. ప్ర‌స్తుతం నిఖిల్, శ‌ర్వానంద్ చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సౌత్‌లో బిజీగా ఉన్న క‌థానాయిక‌ల‌పై...

‘పుష్ష 2’.. మ‌రో టీజ‌ర్ రెడీనా?

అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల 'పుష్ష 2' గ్లింప్స్ విడుద‌లైంది. బ‌న్నీ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ పూన‌కాలు తెప్పించింది. అయితే... మిగిలిన ఫ్యాన్స్‌కు అంత‌గా ఎక్క‌లేదు. టీజ‌ర్‌లో డైలాగ్ వినిపించ‌క‌పోవ‌డం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close