నాగబాబు మాటలతో సంబంధం లేదన్న పవన్ కల్యాణ్..!

గాడ్సే వివాదంతో పాటు.. ఇతర అంశాలపై నాగబాబు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్న వివాదాస్పద అభిప్రాయాలతో జనసేనకు సంబంధం లేదని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధికార ప్రతినిధులు.. అధికారిక వేదికల మీద.. అధికార సోషల్ మీడియా అకౌంట్లలో వ్యక్తం చేసే అభిప్రాయాలు మాత్రమే.. జనసేన పార్టీ అభిప్రాయాలుగా భావించాలని మిగతా ఎవరు మాట్లాడినా వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే భావించాలని పవన్ కల్యాణ్ అన్నారు. నాగబాబు.. నాథూరాం గాడ్సే పుట్టిన రోజున..ఆయనను నిజమైన దేశభక్తునిగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. ఆయన దేశభక్తుడైతే.. ఆయన హత్య చేసిన మహాత్మాగాంధీ దేశద్రోహినా అన్న విమర్శలు ఉద్ధృతంగా వచ్చాయి.

అయితే.. నాగబాబు.. ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను గాడ్సేను దేశభక్తుడు అనిచెప్పాను కానీ..గాంధీని తక్కువ చేయలేదని వాదించారు. జనసేన పార్టీ నేతలకు నాగబాబు వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. సమర్థించాలో..వ్యతిరేకించాలో తెలియక సతమతమయ్యారు. నాగబాబు సైలెంట్ గా ఉంటే.. ఈ వివాదం మరుగున పడి ఉండేదమో కానీ.. ఆయన దీన్ని కొనసగించాలనుకుంటున్నారు. తాజాగా.. భారత కరెన్సీ నోట్లపై ఒక్క మహాత్మగాంధీనే ఎందుకు ఉంచుతున్నారని.. ఇతర స్వాతంత్రసమరయోధుల ఫోటోలు కూడా వేయాలని డిమాండ్ చేస్తూ..మరో ట్వీట్ చేశారు.

గాంధీజి బతికి ఉంటే.. అదే చెప్పావారని కవరింగ్ ఇచ్చారు. ఏ దేశానికైనా స్వాతంత్ర సమరయోధులు.. చాలా మంది ఉంటారు. జాతిపితగా ఒక్కరినే భావిస్తారు. మన దేశంలో మహాత్ముడ్ని భావిస్తున్నారు. అందుకే కరెన్సీనోట్లపై ఫోటో పెడుతున్నారు. ఇప్పుడు మహాత్ముడు ఆ గౌరవానికి పనికిరారన్నట్లుగా నాగబాబు ట్వీట్ ఉంది. ఈ వివాదం ఇంతటితో ఆగదని..జనసేనను చుట్టేస్తుందని కంగారు పడిన పవన్ కల్యాణ్.. ఈ మేరకు నాగబాబువి వ్యక్తిగత అభిప్రాయాలు అని చెబుతూ ఖండన ప్రకటన విడుదల చేశారు. మరి నాగబాబు ఏమంటారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close