బాబును నమ్ముతా… పోలవరం 2018కి పూర్తవదన్న పవన్

జనసేనాని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రాజెక్ట్ నిర్మాణం అంచనాలు అనూహ్యంగా పెరగడానికి కారణం పునరావాస ప్యాకేజీ వ్యయం పెరగడం అని తెదేపా నేతలు చెప్తున్నారని, అలాగే నిర్మాణ వ్యయం పెరగడం కూడా అంటున్నారన్నారు. ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉందన్నారు. నిధుల వ్యయo పై కేంద్రం సందేహించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ అనుమానాలు నివృత్రి చేయాలని దీనికోసం ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని సూచించారు. మన తప్పు లేనప్పుడు భయం అవసరం లేదన్నారు.

కేంద్రం కడతాం అంటే మేమె కడతాం అని తీసుకోవడం, ఇప్పుడు మళ్లీ ఇచ్చేస్తాం అనడం ఏమిటో తనకు అర్ధం కావడం లేదన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ విషయం లో అవకతవకలుసహజమే అన్నారు. ఈ ప్రాజెక్టును ఇక ముందు తరచు సందర్శిస్తానని అవగాహన పెంచుకుంటానని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ 2018కి పూర్తి కాదని స్పష్టం చేశారు. ఇక అలాంటి మాటలు చెప్పొద్దని వినీ వినీ విసుగొచ్చిందన్నారు. ఇప్పటిదాకా ఒక శాశ్వత సచివాలయం కట్టుకోలేకపోయాం అని అలాంటిది ప్రాజెక్ట్ పూర్తి చేసేస్తాం అనడం నమ్మశక్యoగా లేదన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు, అనుభవం పై తన నమ్మకాన్ని ఆయన మళ్లీ వెలిబుచ్చారు. ఇంతకు ముందు బాబును నమ్మానని ఇప్పుడు కూడా నమ్ముతున్నా అని స్పష్టం చేశారు. అయితే తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని ప్రజల పక్షం అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close