వైసీపీలో ప్రతి ఒక్కరూ మినీ జగనే : పవన్

మంత్రులు.. ఆ పై స్థాయిలో ఎవరైనా అన్యాయాలు , అరాచకాలు చేస్తే కొంత భరించవచ్చేమో కానీ కింది స్థాయి వరకూ నేతలు అరాచకాలకు పాల్పడితే తిరుగుబాటు తప్పదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. వైసీపీలో ప్రస్తుతం అందరూ వైసీపీ అధనేత తరహాలోనే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దౌర్జన్యాలు, కబ్జాలతో చెలరేగిపోతున్నారని విమర్శించారు. వరుసగా రెండో వారం విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనవాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వద్దకు పలువురు ప్రభుత్వ బాధితులు వచ్చారు. ఓ గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ ఒకరు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేయడంపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపైనే పవన్ మండి పడ్డారు.

ఒక ప్రభుత్వం స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేస్తే మరో ప్రభుత్వం రుణం మంజూరు చేసింది. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు మాత్రం ఆ భూమిని లాక్కోవాడానికి ప్రయత్నిస్తున్నారు 20 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లో నుంచి బాధితులను వెళ్లగొట్టారు. వైసీపీ పై స్థాయి నాయకులు.. కింది స్థాయి నేతలు కూడా అదే చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఎక్కువగా జనవాణిలో వైసీపీ నేతల దౌర్జన్యాలు, కబ్జాలపైనే తనకు ఫిర్యాదులు వ్సతున్నాయన్నారు. అందుకే వైసీపీ నేతలంటే తనకు చిరాకని స్పష్టం చేశారు.

విశాఖలో కనిపించిన కొండనల్లా మింగేస్తున్నారు. ఈ అన్యాయాలు ఇప్పుడు అడ్డుకోకపోతే ఇవి కొనసాగుతూనే ఉంటాయన్నారు. . దౌర్జన్యాలు పెరిగితే ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారు. ప్రజలు మిమ్మల్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తారని హెచ్చరించారు. జనవాణిలో తాము తీసుకుంటున్న ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నట్లు పవన్‌ చెప్పారు. రెండోవారం కూడా పవన్‌కు సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close