వాళ్లు మనషులే కాదు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా..!

“మీరు మనుషులు కాదా ..?”.. కొత్త రాజకీయం చేస్తున్న పవన్ కల్యాణ్ ఇలాంటి మాటను.. ఏ చంద్రబాబునో.. మరో లోకేష్‌నో అంటే.. పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ ఈ మాట అన్నది ఆయన ఫ్యాన్స్‌ని. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ అభిమానులపై ఆగ్రహంతో ఊగిపోయారు. సంతకవిటి మండలంలో వాల్తేరు బ్రిడ్జి నిర్మాణం కోసం దీక్షలు చేస్తున్న గ్రామస్తులకు సంఘీభావం తెలిపేందుకు పవన్ వెళ్లారు. పవన్ వస్తున్నారన్న విషయం తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల యువత భారీగా అక్కడికి వచ్చారు. అభిమాన హీరోని చూసిన ఆనందంతో ఈలలతో గోల చేశారు. కాబోయే సీఎం పవన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఆ స్లోగన్స్ విని మొదట్లో… సంతోషపడ్డ పవన్.. ఎంతకూ ఆగకపోవడంతో… టెంపర్ తెచ్చుకున్నారు. ఆపాలని.. ఒకటికి రెండు సార్లు విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకుల భాష ప్రకారం.. ఆపాలంటే… పెంచాలనుకున్నట్లు వాళ్లు. మళ్లీ పెంచేశారు. దీంతో పవన్‌కు చిర్రెత్తుకొచ్చింది. 600 రోజులుగా గ్రామస్తులు దీక్షలు చేస్తుంటే బాధగా లేదా అంటూ అభిమానులపై చిందులేశారు. అయినా వినకపోవటంతో మైక్ తీసుకుని మీరు మనుషులు కాదా అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. విశేషం ఏమిటంటే.. ఇలా అరుస్తున్నప్పుడు కూడా కొంత మంది ఈలలు వేసి ప్రొత్సహించే ప్రయత్నం చేశారు.. ఆయనేదో సినిమా డైలాగ్ చెబుతున్నారని వాళ్లు ఫీలయ్యారు. పవన్ కల్యాణ్ ఆగ్రహంపై.. జనసేన నేతలు విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు. గత 3 రోజుల నుంచి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ లో తీవ్రమైన అలసటకు గురయ్యారని… ఇలాంటి సమయంలో ఫాన్స్ విసిగించటంతో ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.

నిజానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. ఆయన ఎదుట చేసిన అల్లరి చిన్నదే. బయట ఆయన ప్యాన్స్ చేసే అల్లరి ఏ స్థాయిలో ఉంటుందో.. గతంలో సినిమా ఫంక్షన్లలో చూశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నారు. విమర్శను ఏ మాత్రం తట్టుకోలేని పీకే ఫ్యాన్స్.. అత్యంత దారుణమైన పదజాలాన్ని వాడుతుంటారు. ఎంత గౌరవనీయుడినైనా.. కించ పరచడానికి వెనుకాడరు. రాజకీయంగానే కాదు.. వ్యక్తిగత విషయాల్లోనూ వారు అంతే. వారిని పవన్ కల్యాణ్ కూడా కంట్రోల్ చేయలేదు. వారంతే… మనుషులే.. కనీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. అనుకోవాలంతే…!

—— సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close