రూపాయి బియ్యంతో సారా, మెలాసిస్ కాసుకుంటారా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్న తాపత్రయంతో… మాట్లాడుతున్న అంశాలపై కంట్రోల్ తప్పిపోతున్నారు. నిన్న పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో …. పోరాటయాత్రలో ప్రసంగించిన పవన్ కల్యాణ్.. చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూపాయికి కిలో బియ్యం .. సారా కాచుకోటానికి , మొలాసిస్ తయారీకి పనికొస్తాయని తేల్చేశారు. బియ్యం ఒక్కటి ఇస్తే సరిపోతుందా..? పప్పు , కారం, నూనె కూరగాయలు ఎక్కడినుంచి తెచ్ఛుకుంటారని ప్రశ్నించారు. అందుకే రేషన్ కు బదులు ప్రతీ కుటుంబానికి రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చామని తన వాదనను సమర్థించుకున్నారు. రూ. 2500 ఇవ్వొచ్చులే కానీ.. రూపాయి బియ్యంతో సారా, మెలాసిస్ తయారు చేస్తారని.. పవన్ కు ఎవరు చెప్పారో మరి..? ఏ పుస్తకంలో చదివారో మరి..?

ఇన్ని సంవత్సరాలు అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెంల్లో ఒక్క పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయలేకపోయారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ఆపద సమయంలో జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు ఆసుపత్రికి వెళ్ళాలంటే కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా లేకపోవడంపై బాధపడ్డారు. జంగారెడ్డి గూడెం టౌన్ హాల్ ని పేకాట క్లబ్బుగా మార్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని మండి పడ్డారు. నిజానికి టౌన్ హాల్ ప్రైవేటు వ్యక్తులది. అందులో పేకాట జరుగుతోందని.. ఎవరు చెప్పారో కానీ పవన్ ఆవేశ పడ్డారు. జంగారెడ్డి గూడెంలోనూ… చింతమనేని తలుచుకున్నారు పవన్. అక్కడ 42 ఎకరాలను చింతమనేని కబ్జా చేశారని ఆరోపించారు.

అమరావతి రాజధాని రైతులకు బాండ్లు ఇచ్చినట్లే పోలవరం నిర్వాసితులకు కూడా బాండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పామాయిల్, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే.. మేనిఫెస్టోలో పెడతామన్నారు. రాష్ట్రంలో సుమారు 19వేల జనసేన పార్టీకి చెందిన ఓట్లను ప్రభుత్వం తొలగించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గానికి పాతిక కోట్లు ఖర్చుపెట్టేందుకు టీడీపీ సిద్ధమైందని జోస్యం చెప్పారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన టీడీపీని అధికారంలోకి రానివ్వబోమని చాలెంజ్ చేశారు. చివరిలో జనసేన విజయం సాధించే తొలి అసెంబ్లీ నియోజకవర్గం చింతలపూడి అవుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో పాయకరావు పేటలోనూ అదే అన్నారు. ఇంతకూ జనసేన మొదట గెలిచేది.. పాయకరావు పేటనా..? చింతల పూడినా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close