ఏపీకి ఇచ్చిన విభజన హమీల లెక్కలను తేల్చేందుకు పవన్ కల్యాణ్ నేతృత్వంలో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ విషయం తెలిసిందే. ఈ సంయుక్త నిజనిర్ధారణ కమిటీ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ఈ సందర్భంగా ట్యాంక్బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పవన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న పవన్ అభిమానులు నినాదాలు చేశారు.
రెండు రోజులపాటు జరగనున్నసమావేశానికి లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ్, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్కుమార్, కొణతాల రామకృష్ణ, సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ హాజరు కానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే మరికొన్ని పెద్ద పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవలే పవన్ ని కలిసిన యోగేంద్ర యాదవ్ (ఆప్ పార్టీ లో మొదట పనిచేసి, ఆ తర్వాత కేజ్రీవాల్ పై తిరుగుబాటు చేసాడీయన), రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవి రెడ్డి, ప్రశాంత్ భూషణ్ ల పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్నాయి.
రెండు రోజులపాటు జరగనున్న ఈ సమావేశం లో నిజ నిర్ధారణ కోసం అధ్యయనం చేయనున్నారు. ఈ మధ్యాహ్నం నుంచి సమావేశాలు జరగనున్నాయి.