డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలోకి పవన్ కల్యాణ్ కూడా !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ డ్రగ్స్ అంశంపై తొలి సారిగా స్పందించారు. దేశంలోనే గంజాయికి ఏపీ ప్రధాన కేంద్రంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ఈ సమస్యను తాను ఇప్పటి నుండి కాదని గతంలో తాను ఒరిస్సా-ఆంధ్రా బోర్డర్‌లో పర్యటించినప్పుడే గుర్తించానని దానికో వీడియోను జత చేశారు. అలాగే ఏపీ నుంచే గంజాయి దేశం అంతా సరఫరా అవుతోందని నల్లగొండ ఎస్పీ చేసిన వ్యాఖ్యలను కూడా మరో ట్వీట్‌లో వివరించారు. అనేక మంది డ్రగ్స్ లార్డ్‌లతో ఏపీ నిండిపోయిందని పవన్ ఆరోపించారు. దేశంపై ప్రభావం చూపుతుందని సమస్యను ప్రభుత్వ పెద్దలు దాచిపెడుతున్నారని ఆరోపించారు.

పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయంగానూ ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ గంజాయి, డ్రగ్స్ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చి పోరాటం చేస్తోంది. దీనికి సంబంధించి ప్రశ్నించామని చెప్పేతమపై దాడులకు తెగబడ్డారని ఆరోపిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ గంజాయి అంశంపై ఎవరు మాట్లాడినా ఆధారాలివ్వాలంటూ వారి ఇళ్లకే పోలీసుల్ని పంపుతోంది. దీంతో మాట్లాడటానికి ఎక్కువ మంది జంకే పరిస్థితి. జనసేన పార్టీ ఇప్పటి వరకూ డ్రగ్స్ అంశాన్ని హైలెట్ చేయలేదు.

ఇప్పుడు అనూహ్యంగా డ్రగ్స్ అంశాన్ని పవన్ కల్యాణ్ టేకప్ చేస్తున్నారు. అంటే టీడీపీ వాదనతో ఏకీభవించినట్లే అవుతుంది. బీజేపీ మాత్రం ఇంత వరకూ ఏపీలో డ్రగ్స్ అంశం గురించి పట్టించుకోలేదు. డ్రగ్స్ అంశంపై జనససేన మరింత విస్తృతమైన ఆందోళనలకు శ్రీకారం చుడితే ఏపీలో రాజకీయం మరింత రాజుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close