అమరావతి విషయంలో పవన్ ఒక వైపే ఎందుకు చూస్తున్నారు..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటయాత్రలో కానీ.. మరో చోట కానీ ఇలా ప్రసంగించి.. అలా ముగించగానే.. అనేక “బ్లూపర్స్‌”ను నెటిజన్లు బయటపెట్టేస్తారు. పవన్ కల్యాణ్‌కు ఇంత చిన్న విషయం కూడా తెలియదా అని ఆశ్చర్యపోయేంతగా… ఆ ప్రసంగాల్లో అంశాలు ఉంటాయి. తడబడతారో… తెలియక చెబుతారో కానీ.. పవన్‌కల్యాణ్‌ను ట్రోలింగ్ చేయడం ఇప్పుడు నెటిజన్లకు చాలా కామెడీ వ్యవహారం అయిపోయింది. తాజాగా అమరావతిని టార్గెట్ చేస్తూ.. ఆయన నిర్వహిస్తున్న సదస్సులు.. రైతులతో సమవేశాలు కూడా.. ఇలాగే మారిపోతున్నాయి. చంద్రబాబుతో నాలుగేళ్ల పాటు సన్నిహితంగా ఉండి.. ఎప్పుడూ రాజధానిపై వ్యతిరేకత వ్యక్తం చేయని ఆయన ఇప్పుడు.. అన్ని కోణాల్లోనూ అమరావతిని టార్గెట్ చేసుకుంటున్నారు.

ఉత్తరాంధ్రకు వెళ్లి లక్షల కోట్లు పెట్టి అమరావతిని అభివృద్ధి చేస్తున్నారని.. ఉత్తరాంధ్రకు మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేరుగా అమరావతి రైతుల్నే రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. భూసేకరణ చట్టంపై నిర్వహించిన సదస్సులోనూ.. పవన్ కల్యాణ్… పదే పదే చెప్పే సినిమా డైలుగులే చెప్పారు. చంద్రబాబును కూడా ఏకంగా తోలు తీస్తామని హెచ్చరిక చేశారు. ఒకటికి నాలుగు ఎక్కువ చేసుకుని అమరావతిలో ఏదో జరిగిపోతుందని నమ్మించే ప్రయత్నం చేశారు. లక్ష ఎకరాల భూసేకరణ ఎందుకని మండిపడ్డారు. మహారాష్ట్ర తరహా రైతుల ఉద్యమం చేసి ముఖ్యమంత్రి ఇంటిముందు బైఠాయిస్తానని కూడా ప్రకటించారు. కానీ అమరావతి భూముల విషయంలో తెలిసి కూడా తెలియనట్లు పవన్ కల్యాణ్‌ వ్యవహరిస్తూండటమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

అమరావతిలో భూసేకరణ చట్టం అమలు చేయలేదు. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా భూములు సేకరించింది. 33వేల ఎకరాల రైతులు ఇచ్చారు. ప్రభుత్వం వచ్చి బెదిరిస్తేనో.. కులం కారణంగానో.. మతం కారణంగానో… భూములు ఇచ్చేస్తారని ఎవరూ అనుకోరు. కోర్ క్యాపిటల్ ఏరియా పరిధిలో … భూములు ఇవ్వని వారు.. మహా అయితే..నాలుగైదు వందల ఎకరాల లోపే ఉంటాయి. వారి కారణాలు వారికి ఉన్నాయి. అంటే.. 98 శాతం మంది భూయజమానులు ప్రభుత్వానికి భూములిచ్చారు. 2 శాతం మాత్రమే ఇవ్వలేదు. ఆ రెండు శాతం కోసం పోరాడుతున్న పవన్.. మిగతా 98 శాతం మంది అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు…? వారు రెండు శాతమే ఉన్నారు కాబట్టి… వారి కోసం తాను పోరాడుతున్నానని చెప్పుకోవచ్చు.. కానీ అసలు అమరావతి ల్యాండ్ పూలింగ్ మొత్తం బెదిరించి చేసినట్లు ఆరోపణలెందుకు చేస్తున్నారు..?

ఉద్దండరాయుని పాలెంలో… అసైన్డ్, లంక భూములకు.. పట్టా భూములకు ఇచ్చినట్లే ప్యాకేజీ ఇవ్వాలనే డిమాండ్‌కు పవన్ మద్దతు పలికారు. అది కూడా ఆ ఒక్క గ్రామలోని వారే ఆ డిమాండ్ చేస్తున్నారు. అసైన్డ్, లంక భూములంటే ప్రభుత్వానివే. సాగు చేసుకోమని.. ప్రభుత్వం వారికి ఇచ్చింది. వారికి యాజమాన్యహక్కులు ఉండవు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్‌లో ఆ భూములు తీసుకుకున్న ప్రభుత్వం ప్యాకేజీ కూడా ఇచ్చింది. కానీ పట్టా భూములతో పాటే.. తమకు ప్యాకేజీ కావాలని వారు పట్టుబడుతున్నారు. తమది కాని భూమికి కూడా.. ప్రభుత్వం పరిహారం ఇస్తూండటంతో.. మిగతా గ్రామాల్లోని వారు ఆనందంగా ఉన్నారు. ఒక్క ఉ్దదండరాయుని పాలెం రైతులే ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో తెలుసుకోలేకపోతున్నారు. కావాలనే పవన్ కల్యాణ్.. అమరావతిలో ఒక వైపే చూస్తున్నారు. ఆ వైపు పవన్ కల్యాణ్‌కు కులం మాత్రమే కనిపిస్తోంది. మరో వైపు చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక దన్నుగా నిలిచే మహా నగరం కనిపిస్తుంది. కానీ పవన్ దాన్ని చూడదల్చుకోలేదు. ఆయన రాజకీయం ఆయనది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close