జేపీ నడ్డా తో పవన్ భేటీ, ఖంగుతిన్న టీవీ9

తెలుగు రాష్ట్రాలలో న్యూస్ ఛానెల్స్ లో టీవీ9 కి ఉన్న క్రెడిబిలిటీ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన విషయంలో తప్పు వార్త ప్రసారం చేసి టీవీ9 ఖంగు తినడం ఈరోజు మీడియా వర్గాలలో ఆసక్తి కలిగించింది. వివరాల్లోకి వెళితే..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటనలో ఉండగా, ఢిల్లీ నుండి కబురు రావడంతో, అటు నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి గత రెండు రోజులుగా అక్కడే మకాం వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది పూర్తిగా రాజకీయ పర్యటన కావడంతో, పవన్ కళ్యాణ్ అక్కడ ఎవరిని కలవనున్నారు అన్న విషయం పై జనసేన పార్టీ మీడియాకు పూర్తి సమాచారం ఇవ్వలేదు. అక్కడ పవన్ కళ్యాణ్ ఎవరెవరిని కలుస్తున్నారు అన్న విషయం మీద సమాచారం లేక పోవడంతో మీడియా చానల్స్ కి కూడా స్పష్టత లేకుండా పోయింది. అయితే, ఈ రోజు మధ్యాహ్నం టీవీ9 , పవన్ కళ్యాణ్ కు రెండో సారి బిజెపి ఝలక్ ఇచ్చిందంటూ వార్తలు ప్రసారం చేసింది. పవన్ కళ్యాణ్ తనకు తానుగా ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడు అని, వారు మాత్రం కరుణించ లేదని, ఇక ఈ రోజు సాయంత్రం లోపు ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తే వారిని కలుస్తాడని, లేకపోతే ఎవరినీ కలవకుండానే తిరిగి వస్తాడని కథనాన్ని ప్రసారం చేసింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ కి ఢిల్లీలో చుక్కెదురైంది అంటూ వ్యాఖ్యానించింది.

అయితే ఈ మధ్యలోనే పవన్ కళ్యాణ్ జేపీ నడ్డా తో భేటీ అయిన విషయం, అందుకు సంబంధించిన ఫోటోలతో సహా జనసేన పార్టీ విడుదల చేయడంతో, టీవీ 9 ఖంగు తిన్నట్లు అయింది. మిగతా అన్ని చానల్స్ లో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వార్తలు స్క్రోల్ అవుతుంటే, తాము ప్రసారం చేసిన వార్తను తామే ఖండించ లేక టీవీ9 మిన్నకుండి పోయింది.

ఏది ఏమైనా, జేపీ నడ్డా తో పాటు మరి కొందరి తో కూడా పవన్ కళ్యాణ్ సమావేశాలు జరిపినట్లు, అమరావతి తో పాటు జగన్ అరాచక పాలన, స్థానిక ఎన్నికలలో పొత్తుల గురించి చర్చించినట్లు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close