శంకుస్థాపనకు పవన్ కూడా డుమ్మా!

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పారు. ఇవాళ నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు స్టూడియోవద్ద జరిగిన ఘటనకుగానూ మీడియా ప్రతినిధులకు ఆయన క్షమాపణలు తెలిపారు. ఆ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక అందించటానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు నానక్‌రామ్‌‌గూడాలో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్‌లో ఉన్న పవన్ వద్దకు వెళ్ళారు. ఇది కవర్ చేయటానికి మీడియా ప్రతినిధులు ఓబీ వ్యాన్‌లతోసహా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. మంత్రులు పవన్‍‌ను కలుస్తున్న దృశ్యాలను కవర్ చేయటానికి సెట్‌లోపలికి వెళ్ళబోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఇరువర్గాలకూ మాటా మాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఒక కెమేరా మ్యాన్‍‌కు గాయాలయ్యాయి. దీనిపై మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేయగా పవన్ మీడియాకోసం మంత్రులను తీసుకుని బయటకు వచ్చి ఆరుబయటే ఆహ్వానపత్రిక తీసుకున్నారు. మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కానీయబోనని అన్నారు.

శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు విషయమై మాట్లాడుతూ, తను హాజరు కావాలనే ఉందని, అయితే షూటింగ్‌కోసం గుజరాత్ వెళుతున్నానని, షెడ్యూల్‌ను బట్టి వీలయితే శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానని చెప్పారు. రాజధాని ఎలా ఉండాలని కోరుకుంటున్నారని మీడియా ప్రతినిధులు అడగగా తాను ప్రజల రాజధానిని కోరుకుంటానని, హైదరాబాద్‌లా కాకుండా ఉండాలని భావిస్తున్నానని అన్నారు. చంద్రబాబు నాయుడుకు సలహాలేమైనా ఇస్తారా అని అడగగా, సలహాలిచ్చేటంత అనుభవం తనకు లేదని చెప్పారు. మొత్తంమీద చూస్తే జగన్ లాగానే పవన్ కూడా శంకుస్థాపనకు గైర్హాజరయ్యేటట్లున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close