పిచ్చివాళ్లు ఆలయాలు, రథాలనే టార్గెట్ చేస్తారా ?: పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న ఆలయాలపై దాడుల ఘటనల విషయంలో కలత చెందారు. హిందూ ధర్మంపై ప్రణాళిక ప్రకారం జరుగుతున్న దాడిగా ఆయన భావిస్తున్నారు. పిఠాపురంలో ఆలయాలను ధ్వంసం చేసినప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే.. ఇప్పుడు సమస్య వచ్చేది కాదనేది పవన్ అభిప్రాయం. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆయన “ధర్మ పరిరక్షణ” దీక్షను చేపట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతిఒక్కరికి ఉందని.. ప్రభుత్వ కాలయాపనతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పిఠాపురంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలోనే చర్యలు తీసుకొని ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావన్నారు.

అంతర్వేది ఘటనలో పోలీసులు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయని పవన్ చెబుతున్నారు. మతిస్థిమితం లేనివారు కేవలం హిందూ దేవాలయాలను.. రథాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వరుస ఘటనలపై బలమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారనేది పవన్ అనుమానం. పవన్ పిలుపు మేరకు బీజేపీ- జనసేన నేతలందరూ… “ధర్మ పరిరక్షణ” దీక్ష చేపట్టారు. ఎవరికి వారు.. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దీక్ష చేపట్టారు. ఢిల్లీలో జీవీఎల్ కూడా దీక్ష చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.

అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటనను.. ఇంతటితో వదిలి పెట్టాలని బీజేపీ, జనసేన అనుకోవడం లేదు. హిందూ ఆలయాలపై దాడులు అంశంపై ప్రజల్లో ఉద్యమం నిర్మించాలని నిర్ణయించారు. ఈ రోజు దీక్ష చేసిన నేతలు.. రేపు ప్రతి ఇంట్లో దీపం వెలిగించాలని నిర్ణయించారు. ఆ తర్వాత తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకోనున్నారు. పవన్ కల్యాణ్ కూడా హిందూ ఉద్యమంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close