వైసీపీ దాడులను ఢిల్లీకి సాక్ష్యాలుగా తీసుకెళ్లబోతున్న పవన్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడిన పరిస్థితిని మరింత సమర్థంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా షూటింగ్‌లు వాయిదా పడటంతో.. ఆయన స్థానిక ఎన్నికల్లో జరిగిన హింసను.. జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు సందేశం పంపించారు. వైసీపీ నేతలు స్థానిక ఎన్నికల్లో చేసిన హింసపై మౌనంగా ఉంటే మరింత పెట్రేగిపోతారని.. నామినేషన్‌ దశలో ఎదురైన ఇబ్బందులు, దాడులపై సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. దాడులు చేసి ఇబ్బందులు పెడుతున్నా రక్షించని అధికారుల వివరాలు ఆధారాలతో సహా తెలియచేయాలని సూచించారు. పూర్తి నివేదికను కేంద్ర హోంశాఖకు స్వయంగా అందజేస్తానన్నారు.

స్థానిక ఎన్నికల సమరంలో.. పలు చోట్ల.. టీడీపీ నేతలపైనే కాదు.. బీజేపీ, జనసేన కార్యకర్తలపైనా దాడులు జరిగాయి. చిత్తూరు జిల్లాలో జనసేన నేతలపై ఎక్కువగా దాడులు జరిగాయి. మాచర్లలోనూ జనసేన తరపున పోటీ చేసిన యువకుడిని తీవ్రంగా బెదిరించి.. నామినేషన్ ఉపసంహరించుకునేలాచేశారు. ఇలాంటి పరిణామాలన్నింటిపై.. ఇప్పుడు ఆధారాలతో సహా.. ఢిల్లీ దృష్టికి తీసుకెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్..ఎన్నికలు వాయిదా కాదు.. రద్దు చేసి..మళ్లీ నామిషషన్ల నుంచి ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏకగ్రీవాలన్నీ.. బెదిరించి చేసినవనేనని.. ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు కేంద్రం దృష్టికి ఈ దాడుల వ్యవహారాల్ని తీసుకెళ్లి…మరింత పకడ్బందీగా వైసీపీ పై పోరాటం చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే.. స్థానిక ఎన్నికల వాయిదా వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కూడా.. బీజేపీ, జనసేన నేతలు ఆధారాలతో సహా ఢిల్లీకి ఫిర్యాదులు పంపిస్తే.. మొత్తానికి..కేంద్రం జోక్యం చేసుకుని ఎన్నికల ప్రక్రియను రద్దు చేసే అవకాశం ఉందని.. జనసేన నేతలు నమ్ముతున్నారు. పవన్ కల్యాణ్ తల్చుకుంటే.. ఏం చేయగలరో చూపిస్తారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close