పవన్ తర్వాత పోరాటం గోదావరి జిల్లాల్లో..‍ ! చేరికలపై దృష్టి పెడతారా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తర్వాతి పోరాటయాత్రను… గోదావరి జిల్లాల్లో ప్లాన్ చేసుకున్నారు. పదహారో తేదీ నుంచి పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రారంభం కానుంది. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది..? ఏ రూట్ లో సాగుతుందన్న వివరాలు… ఎప్పటికప్పుడు ఖరారు చేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా నుంచి పోరాటయాత్ర చేయాలనుకున్నారు. కానీ.. అదే జిల్లాలో .. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర జరుగుతోంది.శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు చెప్పడంతో.. పశ్చిమగోదావరి జిల్లాకు పోరాటయాత్రను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

జనసేనకు ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఆదరణ ఉంటుందని… మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లాల్లో పోరాటయాత్రకు లభించే ఆదరణను బట్టి… జనసేన ప్రభావాన్ని రాజకీయ పార్టీలు కూడా అంచనా వేసుకునే అవకాశం ఉంది.ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా… ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లు సాదించాలి. లేకపోతే.. మెజార్టీ సాధించడం కష్టం. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు జిల్లాల్లో ఘోరంగా దెబ్బతిన్నది. దానికి టీడీపీ – బీజేపీ కూటమికి పవన్ కల్యాణ్ మద్దతివ్వడమే కారణమన్న విశ్లేషణలు చాలా రోజులుగా ఉన్నాయి.

జనసేన స్థాపించి నాలుగేళ్లు దాటుతున్న పవన్ కల్యాణ్ ఇంత వరకూ… ఒక లేయర్ పార్టీ నిర్మాణాన్ని కూడా ప్రారంభించలేదు. అంతో ఇంతో బలం ఉందనుకుంటున్న ఉభయగోదావరి జిల్లాల్లో ప్రముఖ నేతలంటూ జనసేనకు ఎవరూ లేరు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేని కొంత మంది సీనియర్లు పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో.. అటు టీడీపీ, ఇటు వైసీపీ ల్లో అవకాశం దక్కదనుకునేవారు కూడా.. జనవైపు చూస్తారు. పవన్ కల్యాణ్ కాస్తంత రాజకీయంగా ఆలోచిస్తే.. కొన్ని నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులు దొరికే అవకాశం ఉంది. పోరాటయాత్రలో పవన్ చేరికలపై దృష్టి పెడితేనే ఇది సాధ్యమవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close