బీజేపీతో సంబంధం లేకుండా పవన్ అమరావతి యాత్ర..!

రాజధాని రైతుల వాణిని దేశం నలుమూలలా వ్యాపింపచేశానని నినదిస్తానని..జనసేన అధినేత పవన్ కల్యాణ్ శపథం చేశారు. ఈ నెల పదో తేదీ తర్వాత తాను స్వయంగా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. రాజధాని రైతుల ఉద్యమస్ఫూర్తి చూసి.. తెలుగు వారంతా గర్విస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి నిస్వార్థంగా 33 వేల ఎకరాలు ఇచ్చి.. ఇప్పుడు రోడ్డున పడ్డ రైతన్నలకు అండగా ఉంటానని ప్రెస్‌నోట్ విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కల్యాణ్ రాజధాని విషయంలో సైలెంటయిపోయారు. బీజేపీ.. అమరావతి విషయంలో.. మొత్తం.. వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోందని… పవన్ కల్యాణ్ ను నోరెత్తకుండా చేసిందన్న ప్రచారం జరిగింది.

అమరావతి కోసం ఉమ్మడి పోరాటం చేస్తామంటూ గంభీరంగా ప్రకటించిన.. జనసేన, బీజేపీ నేతలు.. ఆ తర్వాత కామ్‌గా ఉండిపోయారు. పవన్ కల్యాణ్ కూడా… బీజేపీ విషయంలో కాస్త తేడా అనుకున్నారేమో కానీ.. సొంత పర్యటన షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు. వచ్చే నెల పదో తేదీ తర్వాత తన పర్యటన ప్రకటన విషయంలో పవన్ కల్యాణ్ బీజేపీని సంప్రదించలేదని.. తెలుస్తోంది. అమరావతి తరలింపును ఆపగల శక్తి బీజేపీకి ఉందన్న ఉద్దేశంతోనే …ఆ హామీతోనే తాను పొత్తు పెట్టుకున్నట్లుగా పవన్ చెబుతున్నారు. పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్న తర్వాత అనూహ్యంగా బీజేపీ సైడయ్యే ప్రయత్నం చేస్తోంది.

దీంతో బీజేపీ.. తనను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందన్న అనుమానం పవన్ కల్యాణ్‌కు వచ్చిందంటున్నారు. అందుకే.. అమరావతి రైతుల విషయంలో తన చిత్తశుద్ధిని చూపించుకోవాలని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పదో తేదీ తర్వాత పవన్ చేపట్టబోయే రాజధాని గ్రామాల యాత్రకు బీజేపీ కలిసి వెళ్లకపోతే.. మైత్రి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా మారే పరిస్థితి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close