ఢిల్లీలో జగన్‌ పాలనపై ఏముకుంటున్నారో ట్వీట్ చేసిన పవన్..!

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అక్కడ ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఏముకుంటున్నారో… కొన్ని పేపర్ క్లిప్పింగ్‌లతో క్లుప్తంగా ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి రెండు కాళ్లను.. ఇసుక బస్తాల్లో వేసి.. మూటకట్టుకుని భారంగా నడుస్తున్న కార్టూన్‌ను.. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన.. జనసేనని.. ఢిల్లీలో .. జగన్ పాలన గురించి అనుకుంటోంది అదేనని క్లారిటీ ఇచ్చారు. 175 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో 151 అసెంబ్లీ స్థానాలలో ప్రజలు గెలిపిస్తే … వచ్చిన ఐదు నెలలు లోనే 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని తీసివేసి ఏభై మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకే దక్కిందని పవన్ విరుచుకుపడ్డారు.

అలాగే అమరావతి అంశంపై మరో ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రికలో వచ్చిన ఎడిటోరియల్ ఆర్టికల్‌ను పవన్ ట్వీట్ చేశారు. ” జగన్ రెడ్డి ” ఏపీలో తప్పుడు రాజకీయాలు చేస్తున్నారన్న విషయాన్ని జాతీయ మీడియా నిర్మోహమాటంగా చెబుతోందన్న అర్థంలో.. ఆ ఎడిటోరియల్‌కు కామెంట్ పెట్టారు. ఢిల్లీ వెళ్లే ముందు పవన్ కల్యాణ్… అమరావతి గురించి మాట్లాడారు. అమరావతిని ఎక్కడ కడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి చాలా రోజులుగా స్పందన లేదు. అసలు ప్రభుత్వానికే.. క్లారిటీ ఉందో లేదో… ప్రభుత్వంలోని పెద్దలకే తెలియడం లేదు.

పవన్ కల్యాణ్‌ ఢిల్లీలో కొంత మంది కీలక నేతల్ని కలిసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తన పర్యటనకు ఎక్కడా మీడియా హైప్ రాకుండా పవన్ కల్యాణ్ జాగ్రత్త పడుతున్నారు. ఎవర్ని కలుస్తున్నారనేది.. సీక్రెట్‌గానే ఉంచుతున్నారు. ప్రభుత్వంలోని పెద్దల్ని కలిస్తే మాత్రం. మీడియాకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. పవన్ ఢిల్లీ పర్యటన వైసీపీలోనూ కాక రేపుతోంది. చంద్రబాబే.. ఢిల్లీకి పంపారంటూ.. అంబటి రాంబాబు లాంటి నేతలు.. అవసరం లేకపోయినా.. ఆరోపణలు చేస్తూ… పవన్ ఢిల్లీ పర్యటనపై తమ ఆందోళనను.. బహిరంగంగానే బయట పెట్టుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close