గ్రామాన్ని దత్తత తీసుకోమని రామ్ చరణ్ ని అడుగుతా : పవన్ కళ్యాణ్

తితిలి తుఫాను సందర్భంగా విలవిలలాడుతున్న శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. జనసేన పార్టీ తరఫున సరుకులు, కూరగాయలు, ప్రస్తుతం జనసైనికులు శ్రీకాకుళం జిల్లా వాసులకు పంచిపెడుతున్నారు. ఇప్పటికీ కరెంటు పునరుద్ధరించబడని గ్రామాలలో పవన్ కళ్యాణ్ బస చేస్తూ, అన్ని పునరుద్ధరించేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వ ప్రకటనల లో డొల్లతనాన్ని బయటపెడుతున్నాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరొక ప్రకటన కూడా చేశారు.

శ్రీకాకుళంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవలసిందిగా, రామ్ చరణ్ ని తాను కోరుతానని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. అయితే ఇదే సందర్భంలో మాట్లాడుతూ, చాలామంది ప్రజలు, సినిమా వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయని భావిస్తూ ఉంటారు అని, కానీ సినిమా వాళ్లకు పేరు ఎక్కువ, డబ్బు తక్కువ అన్నట్లుగా పరిస్థితి ఉంటుందని, సినిమా వాళ్ళ కంటే చాలా ఎక్కువ డబ్బులు రాజకీయ నాయకుల వద్ద, ప్రత్యేకించి కళా వెంకటరావు, లోకేష్, రామ్మోహన్ నాయుడు లాంటి నాయకుల వద్ద ఉంటాయనీ, కానీ వారు ఒక్క పైసా కూడా బయటకు తీయరని వ్యాఖ్యానించాడు.

అయితే రామ్ చరణ్ శ్రీకాకుళంలోని ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకునేలా తాను చేస్తానని చెప్పిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రామ్ చరణ్ ని మాత్రమే కాకుండా, మరి కొందరు పారిశ్రామికవేత్తలని కూడా తాను కలుస్తానని, వారితో కూడా చేతనైనంత సాయం శ్రీకాకుళం కి లభించేలా తాను చేస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close