నెక్ట్స్ కర్నూలు రైతులకు పవన్ భరోసా !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరుమీద ఉన్నారు. ఆయన రైతు భరోసా యాత్రను ఈ సారి కర్నూలు జిల్లాలో నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో యాత్ర పూర్తి చేస్తున్నారు మొదట ఉమ్మడి అనంతపురం జిల్లాలో.. తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర పూర్తి చేసి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందించారు. మూడో జిల్లాగా రాయలసీమలోని కర్నూలు జిల్లాను ఎంచుకున్నారు. ఎనిమిదో తేదీన ఉదయం ఆయన కర్నలు జిల్లాలో అడుగు పెడతారు. పలువురు ఆత్మహత్య చేసుకున్నకౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి.. సాయంత్రం శిరివెళ్లలో బహిరంగసభ నిర్వహిస్తారు.

అక్కడ మిగిలిన వారికి ఆర్థిక సాయం చేస్తారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ. లక్ష చొప్పున పవన్ కల్యాణ్ ఇస్తున్నారు. కర్నూలు జిల్లాలోనూ పెద్ద ఎత్తున కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం వారిని పెద్దగా ఆదుకోలేదు. ఇటీవల పవన్ కల్యాణ్ పరామర్శకు వెళ్తున్నారని తెలిసిన తర్వాత అరకొరగా కొన్ని కుటుంబాలకు పరిహారం మంజూరు చేస్తున్నారు. అన్ని కుటుంబాలకు ఇవ్వడం లేదు. పవర్ కల్యాణ్ పర్యటన వల్లనే భయపడి ఇస్తున్నారని జనసేన నేతలు అంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం భయపడి ఇవ్వడం లేదని. .. ప్రాసెస్ ప్రకారం ఇస్తున్నామని అంటున్నారు.

పవన్ పర్యటన ఖరారైనంది కనుక ఇప్పుడు పవన్ కల్యాణ్ పరామర్శించే కుటుంబాల వివరాలు తెలుసుకుని వారికి ప్రత్యేకంగా నష్టపరిహారం జారీ చేసే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమలో జనసేన ఉనికి కాస్త తక్కువగా ఉంది. అక్కడ కార్యకలాపాలు పెంచాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ రైతు భరోసా యాత్ర… ఆ పార్టీ కర్నూలు నేతల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close