ఏ కష్టమొచ్చినా గుర్తుకొచ్చేది నానీలే – కానీ !

వైసీపీ హైకమాండ్ కు ఏ కష్టమొచ్చినా ముందుగా గుర్తుకొచ్చేది పేర్ని నాని, కొడాలి నానిలే. వారినే సమావేశం అని తాడేపల్లికి పిలిపిస్తారు. మీడియా ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తారు. అదే తమ విధానం అనుకుంటారు. అలా మాట్లాడితేనే మీడియాలో ఫోకస్ వస్తుంది. లేకపోతే రాదు. అందుకే ఆ నానీలిద్దర్ని పిలిచి మాట్లాడిస్తారు. కానీ పార్టీలో మాత్రం వారికి లభించే ప్రాధాన్యం అంతంతమాత్రం. తాము పెద్ద పాలేర్లమని చెప్పుకుని సిగ్గు వదిలేసి… తుడిచేసుకుని తిరుగుతున్నారు కానీ… వారిలోనూ అసంతృప్తి ఉండే ఉంటుంది.

మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో పనికి మాలిన వాళ్లను మంత్రులుగా కొనసాగించి తమను పని తీరు పేరుతో పక్కన పెట్టడం వారికి అసంతృప్తి కలిగించకుండా ఉంటుందా ? ఇలా పక్కన పెట్టి.. పోటుగాళ్లని మంత్రి పదవులు ఇచ్చిన వారిని కాకుండా. .. మళ్లీ తమను పిలిచి ఎందుకు ఇలా ప్రెస్ మీట్లు పెట్టించి.. ప్రభుత్వ విధానాలపై మాట్లాడిస్తారని వారు అనుకోకుండా ఉంటారా ? పదవులు వాళ్లకు .. బాధ్యతలు మాకా అని వీరు అనుకోకుండా ఎందుకు ఉంటారు … ? కానీ మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం వీరిని ఫిక్స్ చేసేసింది. విపక్షం నేతలు క్షమించరానంతగా మాట్లాడారు. ఎన్ని అవమానాలు జరిగినా వైసీపీలో ఉండటం తప్ప వేరే మార్గం లేదు. అందుకే వీరు కూడా.. చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు.

తాము పూర్తి స్థాయిలో ఫిక్స్ అయ్యామని వారికీ అర్థమైంది. కానీ తమ రాజకీయ భవిష్యత్ ను పణంగా పెట్టి… ఇలా చేయాల్సి రావడం వారిలోనూ అసహనానికి కారణం అవుతుంది. అది ఎప్పుడు బయటపడుతుందో కానీ.. వైసీపీని షేక్ చేస్తుందని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మరితంగా బయటపడిన తర్వాత వీరు కూడా తమదైన రాజకీయం చేసి… సీఎంజగన్ కు చుక్కలు చూపిస్తారని వారి అనుచరులు… చెప్పుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close