పాపం… కామ్రేడ్లు…!

ఒకటి ప్లస్ ఒకటి ఈజీక్వల్ టూ రెండు. ఇది గణితం. ఒక్కో సారి ఒకటి ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు సున్నా. ఇది రాజకీయ గణితం. బెంగాల్లోని కామ్రేడ్లకు ఈ విషయం ఆలస్యంగా అర్థమైంది. తమది సిద్ధాంతాలకు నిబద్ధమైన పార్టీ అని చెప్పుకొనే సీపీఎం, ఇతర లెఫ్ట్ పార్టీల నేతలు బెంగాల్లో విజయానికి పాపం చాలా కష్టపడ్డారు. సాధారణంగా తోటి వామపక్షాలతోనే పొత్తు పెట్టుకోవడం సీపీఎం ఆనవాయితీ. దాన్ని విస్మరించినా, చివరకు మూడో స్థానానికి దిగజారడం వామపక్ష కూటమికి జీర్ణం కాని విషయమే.

బెంగాల్లో మాత్రం తమ 34 ఏళ్ల కంచుకోటను బద్దలు కొట్టిన దీదీని ఓడించడానికి చాలా ప్రయత్నించారు. చివరకు సిద్ధాంతాల విషయంలోనూ రాజీ పడ్డారు. కొన్ని దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా రాజకీయ యుద్ధం చేసిన హస్తం పార్టీతో దోస్తీ చేయడానికి సిద్ధపడ్డారు. ఈ వార్తను తొలిసారిగా వినగానే బెంగాల్ పల్లెప్లెనా వామపక్ష కార్యకర్తలు షాకై ఉంటారు.

ఈసారి తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించి, తమ కంచుకోటను కైవసం చేసుకోవాలనే ఒకే ఒక్క లక్ష్యంతో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేశారు. అంతేనా,
సీట్ల సర్దుబాటే తప్ప, ఉమ్మడి ప్రచారం ఉండదని మొదట కొందరు కామ్రేడ్లు చెప్పారు. చివరకు రాహుల్ గాంధీతో వేదికను పంచుకుని ఘనంగా ఉమ్మడి ప్రచారం చేశారు.

అధికారంలో ఉండికూడా, ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని భారీ విజయాన్ని సాధించడం ద్వారా మమతా బెనర్జీ తన రాజకీయ బలాన్ని చాటారు. కామ్రేడ్లతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ 44 సీట్లను సాధించి రెండో స్థానంలో నిలిచింది. హస్తంతో దోస్తీ చేసిన లెఫ్ట్ మాత్రం 33 సీట్లతో మూడో స్థానానికి పడిపోయింది. పార్టీల వారీగా చూస్తే సీపీఎం మరీ 28 సీట్లకే పరిమితమైంది.

రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే ఇద్దరి ఓటు బ్యాంక్ ఒకరికొకరికి బదిలీ కావాలి. కానీ అలా జరిగిందా అనేది అనుమానమే. స్థానిక అంశాలు, రాష్ట్ర స్థాయి అంశాలు కూడా ఈ విషయంలో ప్రభావం చూపుతాయి. అసలు కాంగ్రెస్ తో పొత్తు అనేదాన్ని కామ్రేడ్ల శ్రేణులు జీర్ణించుకోవడానికే చాలా సమయం పట్టి ఉంటుంది. పట్టణాల్లో, పల్లెల్లో పరస్పరం భీకర యుద్ధం చేసిన సీన్లు గుర్తుకు వచ్చి ఉంటాయి. మరోవైపు, కేరళలో జరుగుతున్న పొలిటికల్ ఫైట్ కూడా స్ఫురణకు వచ్చి ఉంటుంది.

బెంగాల్లో దోస్తీ, కేరళలో కుస్తీయా అని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ చేసిన విమర్శలు ప్రభావం చూపి ఉంటాయని కూడా పరిశీలుకలు భావిస్తున్నారు. అందుకే ఓట్ల బదలాయింపు జరగలేదని వారి అభిప్రాయం. మరో ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవడం కాంగ్రెస్, కామ్రేడ్లకు అనివార్యం. ఆ తర్వాతైనా విజయం ఖాయమని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కేరళలో ఐదేళ్ల కోసం అధికారం మారడం ఆనవాయితీ. తమిళనాడులోనూ ఇదే ఆనవాయితీ ఉన్నా, దాన్ని జయలలిత బద్దలు కొట్టారు. కేరళలో సుపరిపాలన ద్వారా లెఫ్ట్ కూడామి కూడా 2021లో ఈ ఆనవాయితీని బద్దలు కొడతారో లేదో చూడాలి. బెంగాల్లో మాత్రం ఈ స్థాయికి దిగజారడం సీపీఎం నేతలకు ఏమాత్రం మింగుడు పడని. అయినా తప్పదు. వ్యూహం వికటించింది. ఫలితం ఒప్పుకోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close