తెలకపల్లి రవి : తమరు వెళ్లడం అవసరమా, అద్యక్షా!

ఏది చేసినా అంగరంగ వైభోగంగా ఆధ్మాత్మిక సౌరభాలు వెదజల్లే అంతర్జాతీయ గురు శ్రీశ్రీశ్రీరవిశంకర్‌ వివాదాస్పద వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షం కావడం సరైందేనా? యమునాతీరంలో శ్రీరామరాజ్యం బాహుబలి సినిమా సెట్టింగులను తలదన్నే నిర్మాణాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని అధికారిక సంస్థలు ఘోషించాయి. దేశభక్తి పేరిట నిరంతరం కీర్తించే భారత సైనికులను స్వామి వారి అనధికార వేదిక ఏర్పాట్లకోసం తరలించడంపై సీనియర్‌ అధికారులు బాధపడినా క్రమ శిక్షణ పాటించారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మొదట చివాట్లు పెట్టి తర్వాత పరిహారం కింద అయిదు కోట్లు అక్కడ పెట్టి అడుగుముందకేయాలని ఆదేశించింది. జైలుకైనా పోతాగాని పైసా ఫైన్‌ కట్టబోనని బెట్టుచేశారు స్వామీజీ. కాని సాయింత్రానికి నిర్వాహకులు దిగివచ్చి ముందు అడ్బాన్సు కింద పాతిక లక్షలు వుంచండి తర్వాత తక్కింది కట్టేస్తాం అని ఎలాగో ఒప్పింకున్నారు. ఈ పంచాయతీని చూసి ప్రథమ పౌరుడు ప్రణబ్‌ ముఖర్జీ మొదటే సర్దుకున్నారు. చివరకు విదేశాల నుంచి రావలసిన అతిధులు జింబాబ్బే అద్యక్షుడు రాబర్ట్‌ ముగాబే శ్రీలంక అద్యక్షుడు సిరిసేన, ఆఫ్టన్‌ మాజీ అద్యక్షుడు కర్జారు, పాక్‌ మాజీ ప్రధాని గిలానీ వంటివారు కూడా మొహం చాటేశారు.ముగాబే అయితే హరారే విమానాశ్రయం నుంచి బయిలుదేరాక కూడా ఆలోచన మార్చుకున్నారు. దీనంతటి వల్ల ప్రతిష్ట పెరిగిందో తగ్గిందో తేలిగ్గానే అర్థమవుతుంది. కాని ఇవేవీ పట్టించుకోని ప్రధాని మోడీ మాత్రం స్వామీజీ పక్కన ఆసీనులై ఆకాశానికెత్తారు. పైగా మన ఘన సాంసృతిక వారసత్వాన్ని విమర్శిస్తారా అంటూ పరోక్షంగా వంత పాడారు. సాక్షాత్తూ దేశాధినేతలే వివాదగ్రస్త కార్యక్రమాలకు వంతపాడితే ఇక అధికారులు నోరు మెదపగలరా? లలిత్‌ మోడీకి సుష్మా వసుంధరలు, విజరు మాల్యాకు అరుణ్‌జైట్లీ రాజ్‌నాథ్‌లు ఇప్పుడు శ్రీశ్రీకి స్వయానా ప్రధాని. దేశభక్తి జాతీయ వాదం ఇలాగే వుంటాయా అని ఆశర్యపోకండి. నీతిబోధలతో తరించండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close