ఏపి బడ్జెట్ లో పోలవరం, రాజధానికి నిధులు కేటాయింపు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇవ్వాళ 2016-17 ఆర్ధిక సం.లకి బడ్జెట్ ని మధ్యాహ్నం 12.00 గంటలకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తరువాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ని శాసనసభకి సమర్పిస్తారు. రాష్ట్ర బడ్జెట్ సుమారు రూ.1.30 కోట్లు ఉండే అవకాశం ఉంది.

పోలవరం, రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో చాలా అసంతృప్తిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని తమ ప్రభుత్వమే నిర్మిస్తుందని ఈమధ్య తరచూ చెపుతున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వానికి శక్తికి మించినపనే అయినప్పటికీ, కేంద్రానికి తమ అసంతృప్తిని తెలియజేయడానికే అన్నట్లుగా ఈసారి రాష్ట్ర బడ్జెట్ లో పోలవరానికి రూ.3,300 కోట్లు రాజధాని నిర్మాణానికి రూ. 2,000 కోట్లు కేటాయించబోతున్నట్లు సమాచారం.

ఈసారి కేంద్రబడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకి రూ.100 కోట్లు మాత్రమే కేటాయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విధంగా ప్రతీ బడ్జెట్ లో కేటాయింపులు జరిపినట్లయితే ఆ ప్రాజెక్టు ఎన్నటికీ పూర్తయ్యే అవకాశం ఉండదు. దానిని వచ్చే ఎన్నికలలోగా పూర్తి చేసి చూపిస్తామని రాష్ట్ర బారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు నిన్న శాసనసభలో చాలా గట్టిగా చెప్పారు.

2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమయంలో రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అన్ని విధాల సహకరిస్తామని చెప్పిన నరేంద్ర మోడీ, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చొరవ వలన రూ.1,600 కోట్లు మాత్రం మంజూరు అయ్యేయి. ఈసారి కేంద్ర బడ్జెట్ లో కూడా రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా అసంతృప్తిగా ఉంది. అందుకే ఈసారి రాష్ట్ర బడ్జెట్ లో రాజధాని నిర్మాణం కోసం రూ.2,000 కోట్లు కేటాయించబోతోందని తెలుస్తోంది.

అమరావతిని స్విస్ ఛాలెంజ్ పద్దతిలో నిర్మించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ దానికి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ సంస్థల గొంతెమ్మ కోరికలు తీర్చడం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కష్టంగా మారింది. ఆ కారణంగా దాదాపు రెండేళ్ళు పూర్తి కావస్తున్నా ఇంతవరకు రాజధాని నిర్మాణ పనులు మొదలుకాలేదు. కనుక కేంద్రం ఇచ్చిన సొమ్ముకి రాష్ట్రం తరపున కూడా మరో రూ.2,000 కోట్లు కలిపి, దానితో రాజధాని ప్రాంతంలో పనులు మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముందు పనులు మొదలుపెడితే నిధుల కోసం కేంద్రంపై కూడా ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ విదేశీ సంస్థలు తమ గొంతెమ్మ కోరికలను పక్కనపెట్టి రాజధాని నిర్మాణానికి ముందుకు వస్తే ఇంక నిధుల సమస్యే ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close