పోలవరం “గిన్నీస్” రన్..!

పోలవరం ప్రాజెక్ట్ పనులు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కనున్నాయి. ఒకే రోజు రికార్డు స్దాయిలో కాంక్రీట్ పనులు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించడానికి ప్రభుత్వం, కాంట్రాక్టు ఏజెన్సీ నవయుగ పనులు ప్రారంభించింది. ఈ పనులను.. పరిశీలించడానికి గన్నిస్ ప్రతినిధులు కూడా వచ్చారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 24గంటల్లో 28వేల క్యూబిక్ మీటర్ల పని చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకూ నిరంతరాయంగా కాంక్రీట్ పని జరగనుంది. రికార్డును అధిగమించినా, పనులు ఆపకుండా కొనసాగించాలని నవయుగ కంపెనీ నిర్ణయించింది. నిర్విరామంగా 30 నుంచి 35 గంటల పాటు ఈ కాంక్రీటు వేసే పనిని చేయాలని నిర్ణయించారు. అప్పటి వరకు ఎంత పని పూర్తయితే, అంత పని రికార్డుగా మలిచే యోచనలో కంపెనీ ప్రతినిధులు, పోలవరం ఇంజనీర్లు ఉన్నారు.

పోలవరంలో ప్రస్తుతం నవయుగ కంపెనీకి చెందిన ఇంజనీర్లు, ఇతర సిబ్బంది సుమారు నాలుగువేల మంది పని చేస్తున్నారు. వీరు కాకుండా పోలవరం ప్రాజెక్ట్ కు సంబధించి ఇతర ఇంజనీర్లు సుమారు 15 వందల నుంచి 2వేల మంది ఈ గిన్నిస్ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు. పని పూర్తయ్యాక, రెండు గంటల వ్యవధిలోనే గిన్నిస్ బుక్ ప్రతినిధులు అక్కడికక్కడే ఈ రికార్డును ధృవీకరిస్తారు. రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్ ను కంపెనీ ప్రతినిధులకు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు.

ప్రస్తుతం ప్రపంచం రికార్డు దుబాయ్ లోని రాల్స్ కాంట్రాక్టింగ్ అండ్ అల్ఫా ఇంజనీరింగ్ కంపెనీ పేరు మీద ఉంది. ఈ కంపెనీ 2017 మే నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 35 గంటల 19 నిమిషాల వ్యవధిలో 21 వేల 580 క్యూబిక్ మీటర్ల పని చేసింది. దుబాయ్ లో ఓ భారీ భవన నిర్మాణానికి సంబంధించి ర్యాఫ్ట్ ఫౌండేషన్ కోసం ఈ వర్క్ చేశారు. ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసి, కొత్త రికార్డు సృష్టించడానికి పోలవరం ప్రాజెక్టు వేదికగా నవయుగ కంపెనీ సిద్దమయ్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close