మంత్రి స్వగ్రామంలో పేకాట డెన్..! కానీ ఆయనకేం సంబంధం లేదు..!

ఓ మంత్రికి సంబంధించిన కారులో కోట్లకు కోట్లు పట్టుబడతారు.. కానీ ఆయనకేం సంబంధం ఉండదు. ఓ ఎమ్మెల్యే గోడౌన్‌లో గుట్కా తయారీ ఫ్యాక్టరీ ఉంటుంది. కానీ ఆయనకేం సంబంధం ఉండదు.. ఈ తరహాలోనే మరో మంత్రి స్వగ్రామంలో పేకాట డెన్ బయటపడింది. కానీ ఆయనకేం సంబంధం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో అంతే జరుగుతుంది. కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా లెచిన గుమ్మనూరు జయరాం మంత్రి అయ్యారు. ఆయన ఇంటి పేరు.. ఆయన స్వగ్రామం పేరు ఒకటే. అదే గుమ్మనూరు. ఆయన బంధువర్గం మొత్తం అక్కడే ఉంటుంది. అలాంటి ఉరు… ఇటీవలి కాలంలో బాగా ప్రసిద్ధి చెందింది.

కర్నూలు జిల్లా గుమ్మనూరు అడ్రస్ ఎక్కడ అని కనుక్కుని.. కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఖరీదైన కార్లలో వస్తున్నారు. ఎందుకంటే.. మంత్రిగారు అంత కుగ్రామం నుంచి ఎలా ఎదిగారో తెలుసుకోవడానికి కాదు. అక్కడ ఏర్పాటు చేసిన పేకాట డెన్ లో పేకాట ఆడుకోవడానికి. స్వయంగా మంత్రిగారి ఇలాఖా…. ఆయనకు తెలియకుండా పోలీసు కూడా అడుగు పెట్టే చాన్స్ లేదు. అందుకే…భరోసాగా ఉంటుందని అందరూ అక్కడకు వచ్చి పేకాడేసుకుంటున్నారు. రోజుకు కోట్లలోనే లావాదేవీలు జరుగుతున్నాయి. కమిషన్ రూపంలో కనీసం రూ. పది లక్షలు రోజుకు మంత్రి క్యాంప్‌కు అందుతాయని చెప్పుకుంటూ ఉంటారు.

అయితే.. గుమ్మనూరు కు ఈ ఖ్యాతి రావడం ఇష్టం లేకనో.. లేక అంత ఆదాయం వస్తుందని కుళ్లుకున్నారో కానీ.., ఎవరో.. పోలీసులకు సమాచారం అందించారు. అంత పెద్ద పేకాట డెన్ నడుస్తూంటే.. ఇప్పటి వరకూ పోలీసులకు తెలియదా అని అనుకోకుండా ఉండలేం. తెలుసు… కానీ.. ఎటాక్ చేసే ధైర్యం లేదు. ఎవరో మంత్రిగారి బండారం బయటపెట్టాలని… వైసీపీలోనే పెద్ద తలకాయ అనుకున్నారు కాబట్టి.. వెంటనే పోలీసులు రెయిడ్ చేశారు. బాగోతం అంతా బయటపెట్టారు. మంత్రి సోదరుడే.. పేకాట డెన్ నిర్వాహకుడని తేలింది. అయితే.. కాసేపటికే.. మంత్రి నుంచి ప్రకటన వచ్చింది. తనకు..తన కుటుంబసభ్యులకు ఏం సంబంధం లేదని..! పోలీసులు కూడా అదే రాసుకుంటారు..! ఏపీలో జరిగేది అదే కదా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close