పార్లమెంటు సమావేశాలకి అన్ని పార్టీలు రెడీ

నవంబర్ 26 నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు పార్లమెంటులో ప్రస్తావించవలసిన అంశాలను ఖరారు చేసుకొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుని యుద్ద ప్రాతిపదికన నిర్మాణం తదితర అంశాల గురించి పార్లమెంటులో ప్రస్తావించాలని వైకాపా నిర్ణయించుకొంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడితో ఈ అంశాల గురించి మాట్లాడాలనుకొంటున్నారు. మిత్రపక్షాలుగా ఉన్న తెదేపా, బీజేపీలు రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు,ముఖ్యంగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి గురించి ఈ సమావేశాలలో ప్రస్తావించవచ్చును.ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటులో ఒక్క సభ్యుడు కూడా లేడు కనుక ఆ పార్టీ ఈ సమావేశాల గురించి ఆలోచించనవసరం లేదు.

తెలంగాణాలో తెరాస కేంద్రం పట్ల ఎప్పుడూ అనిశ్చిత వైఖరినే ప్రదర్శిస్తుంటుంది. కొన్ని రోజులు ప్రధాని మోడికి, కేంద్రప్రభుత్వానికి అనుకూలంగా, మరి కొన్ని రోజులు బద్ద శత్రువులా వ్యవహరిస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకంలో భాగంగా తెలంగాణాకు కేవలం 10,000 ఇళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 2 లక్షల ఇళ్ళు కేటాయించడంపై గుర్రుగా ఉన్న తెరాస ప్రభుత్వం ఈసారి కేంద్రప్రభుత్వంపై యుద్దానికి సిద్దం అవుతోంది. కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల ప్రదర్శిస్తున్న ఈ పక్ష పాత వైఖరి గురించి పార్లమెంటు సమావేశాలలో కేంద్రాన్ని తప్పకుండా నిలదీస్తామని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. ఇదికాక ఏడాదిన్నరగా పెండింగులో ఉన్న హైకోర్టు విభజన, ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, నిధుల విడుదల వంటి అనేక ఇతర అంశాలను ప్రస్తావించబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close