ఆర్టీసీ సమ్మెను జఠిలం చేస్తోంది హూజూర్ నగర్ ఉపఎన్నికే..!?

ఓ వైపు హుజూర్ నగర్ ఉపఎన్నిక జరుగుతోంది. మరోవైపు ఆర్టీసీ సమ్మె ప్రారంభమయింది. రాజకీయం కూడా అదే స్థాయిలో ఊపందుకుంది. ఈ అంశాన్ని హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు అన్ని పక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వం చేతల ద్వారా… ప్రతిపక్షం మాటల ద్వారా.. హజూర్ నగర్ ప్రజలను ప్రభావితం చేస్తోందని అంటున్నారు. రాజకీయ పార్టీలన్నీ… మూడు రోజుల కిందటి వరకూ హుజూర్ నగర్ ఉపఎన్నికపై చర్చోపచర్చల్లో మునిగాయి. ఆ నియోజకవర్గంలో ప్రచారం.. పార్టీ నేతల మోహరింపు.. పోలింగ్ వ్యూహాలే హైలెట్ అయ్యేవి. హఠాత్తుగా… హుజూర్ నగర్ ఉపఎన్నిక గురించి అందరూ మర్చిపోయారు. ఇప్పుడు అందరూ ఆర్టీసీ సమ్మె గురించే మాట్లాడుకుంటున్నారు.

ఉద్యోగులపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న దూకుడైన నిర్ణయాల గురించే చర్చించుకుంటున్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే సహించబోమన్న సంకేతాన్ని ప్రభుత్వం పంపుతోంది. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్న వాదనను ప్రతిపక్షం తెరపైకి తెచ్చింది. కేసీఆర్‌ను నియంత్రించాలంటే.. హూజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌ను ఓడించాల్సిందేనని పిలుపునిపిస్తున్నారు.. రాజకీయ వ్యూహాల్లో పండిపోయిన కేసీఆర్… ఆర్టీసీ విషయంలో అంత ఘాటుగా వ్యవహరించడానికి హుజూర్ నగర్ ఉపఎన్నిక కూడా ఓ కారణం అని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రజలపై సాధారణంగా కాస్తంత వ్యతిరేకత ఉంటుంది. లంచాలు తీసుకుంటారని… తాము కట్టే పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ తమను వేధిస్తూంటారని సామాన్య ప్రజలకు ఓ అభిప్రాయం ఉంది. కేసీఆర్ దీన్ని గుర్తించారు. ఉద్యోగుల్ని మంచి చేసుకునేదుకు వారికి తాయిలాలు ప్రకటించడం కన్నా… వారి విషయంలో కఠినంగా ఉండి ప్రజల మద్దతు పొందడం సులువని అంచనా వేసుకున్నారని చెబుతున్నారు. వారి విషయంలో కేసీఆర్ కరెక్ట్ చేస్తున్నారన్న అభిప్రాయాన్ని ప్రజలకు కల్పించే ప్రయత్నం చేశారు. ఇది హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ప్రజల నుంచి తమకు మద్దతు లభించడానికి ఉపయోగపడుతుందని.. ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొట్టే వ్యూహంలో టీఆర్ఎస్ ఉందని గుర్తించిన కాంగ్రెస్.. తెలంగాణ ఉద్యమంలో వారు పోషించిన పాత్రను గుర్తు చేస్తూ… ప్రజల్లో వారిపై సానుభూతి పెంచేదుకు ప్రయత్నిస్తున్నారు. వారి కోసం పోరాడుతున్న తమకు ప్రజల మద్దతు లభించేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెకు… ఆర్టీసీ కార్మికులను ఒప్పించేందుకు అప్పట్లో కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చారో అన్నింటినీ బయట పెడుతున్నారు. కార్మికులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారం ఉందని నియంతలా మారిపోయారని.. హుజూర్ నగర్‌లో ఓడిస్తేనే కేసీఆర్ దారిలోకి వస్తారని.. కాంగ్రెస్ నేతలంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close