స్టార్ హీరో సినిమా అయినా సరే… కథానాయికని ఎంపిక చేసుకోవడంలో కిందా మీదా పడాల్సిందే. కధానాయికలు తక్కువైపోవడం, ఉన్నవాళ్ళంతా బిజీ ఐపోవడం తో ఈ కసరత్తులు తప్పడం లేదు. అల్లు అర్జున్ సినిమాకీ ఇదే సమస్య ఎదురయ్యింది. అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం దువ్వాడ జగన్నాధమ్. ఈ మధ్యే ఈ చిత్రం కొబ్బరికాయ కొట్టుకుంది. త్వరలోనే చిత్రీకరణ మొదలెడతారు. కథానాయిక కోసం చిత్ర బృందం తీవ్రంగా అన్వేషిస్తోంది. ముందు కాజల్ ని అనుకున్నారు. ఆ తరవాత మెహరీన్ లైన్ లోకి వొచ్చింది. ఇప్పుడు పూజా హెగ్డే కి ఫిక్స్ అయ్యారు. వరుణ్ తేజ్ సినిమా ముకుందా తో ఎంట్రీ ఇచ్చింది పూజా. ఆ తరవాత మొహంజదారో తో బాలీవుడ్ కి వెళ్ళింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ వైపు ఆశగా చూస్తోంది. బన్నీ పక్కన ఛాన్స్ దక్కడంతో.. పూజా జాతకం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని టాక్.