2016 మే లోనే ప్రభాస్‌ కొత్త సినిమా స్టార్ట్‌ అవుతుందట.!

‘బాహుబలి’ కోసం మూడేళ్ళు కష్టపడిన ప్రభాస్‌ ఇప్పుడు ‘బాహుబలి2’ షూటింగ్‌లో బిజీగా వున్నాడు. ఈ చిత్రాన్ని 2016లోనే రిలీజ్‌ చేస్తానని రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సంవత్సరం ఈ సినిమా రిలీజ్‌ అయ్యే అవకాశాలే లేవని టాలీవుడ్‌లో, ట్రేడ్‌ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కానీ, ఈ సంవత్సరం మే లోనే ప్రభాస్‌ కొత్త సినిమా స్టార్ట్‌ అవుతుందని వస్తున్న వార్తల్ని బట్టి చూస్తే రాజమౌళి అన్నంత పని చేసేలా కనిపిస్తున్నాడు. ‘బాహుబలి’ స్టార్ట్‌ అయిన తర్వాత తన నెక్స్‌ట్‌ మూవీ ‘రన్‌ రాజా రన్‌’ డైరెక్టర్‌తోనే చేస్తానని ప్రభాస్‌ చెప్పాడు. అతను చెప్పినట్టుగానే మే లో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవుతోంది. స్క్రిప్ట్‌ మీద బాగా వర్కవుట్‌ చెయ్యమని ప్రభాస్‌ ఇచ్చిన సలహాను పాటిస్తూ సుజీత్‌ అదే పనిగా స్క్రిప్ట్‌ని చెక్కుతున్నాడట. స్క్రిప్ట్‌ని హండ్రెడ్‌ పర్సెంట్‌ పక్కాగా రెడీ చేసుకొని మే నుంచి షూటింగ్‌ వెళ్ళాలని ప్రభాస్‌, సుజీత్‌ భావిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ప్రభాస్‌ సొంత సంస్థ అయిన యు.వి. క్రియేషన్స్‌ బేనర్‌లో వంశీ, ప్రమోద్‌ నిర్మించనున్నారు. మరో కొత్త విశేషమేమిటంటే ఈ చిత్రంలో ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. ఫస్ట్‌ టైమ్‌ ప్రభాస్‌ చేస్తున్న ఈ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ చాలా పవర్‌ఫుల్‌గా వుంటుందని సమాచారం. ‘మిర్చి’, ‘రన్‌ రాజా రన్‌’, ‘శ్రీమంతుడు’ సూపర్బ్‌ ఫోటోగ్రఫీ అందించిన మది ఈ కొత్త చిత్రానికి కూడా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేస్తారట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close