మోడీ టీంలో మార్పుచేర్పులు..! ఏపీకి చోటు దక్కుతుందా..?

రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి కేంద్ర మంత్రివర్గంలో మార్పుచేర్పులు చేయడం బీజేపీ అధినాయకత్వం చేసే ప్రక్రియ. ఈ సారికూడా అలాంటి ప్రక్రియే ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ.. మంత్రుల పనితీరును సమీక్షిస్తున్నారు. ఈ సమీక్షల్లో ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా…బీజేపీ అధ్యక్షుడు నడ్డా పాల్గొంటున్నారు. పనితీరు నాసిరకంగా ఉన్న వారినితప్పించి.. కొత్త వారికి చాన్సివ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం నిబంధనల ప్రకారం… భర్తీ చేసుకోగలిగిన మంత్రి పదవులు ఖాళీగా ఇరవైకిపైగానే ఉన్నాయి. రెండో సారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన నరేంద్రమోడీ… ఆ తర్వాత మరోసారి విస్తరణ చేపట్టలేదు.

వచ్చే ఏడాది అత్యంత కీలకమైన యూపీ,పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల కీలక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో.. మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని…భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. కేంద్రమంత్రి పదవులను ఆశచూపి.. గత రెండేళ్ల కాలంలో చాలా మందిని బీజేపీలోకి చేర్చుకున్నారు. చాలా రాష్ట్రాల నుంచి ఇలా చేరిన వారు ఉన్నారు. వారికిచోటు కల్పించాల్సి ఉంది. రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న రాష్ట్రాల నేతలకు మరింత అధికార బలం కల్పించాల్సి ఉంది. వీటిపై ప్రస్తుతం మోడీ, అమిత్ షా దృష్టి పెట్టినట్లుగా భావిస్తున్నారు.

దేశంలో అన్ని రాష్ట్రాలకు మంత్రివర్గంలో చోటు ఉంది.కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం కేంద్రమంత్రి ఎవరూ లేరు. బీజేపీకి కానీ.. మిత్రపక్షాలకు కానీ ఎంపీలు ఎవరూ లేకపోవడం… మొదట్లో చోటు కల్పించలేకపోవడానికి ఓ కారణం అనుకున్నారు. అయితే ఆ తర్వాత టీడీపీ ఎంపీల్ని చేర్చుకున్నారు. బీజేపీలో విలీనం చేసుకున్నారు. సుజనా చౌదరికి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారని అప్పుడే ప్రచారం జరిగింది.కానీ ఏం జరిగిందో కానీ.. మొత్తం సైలెంట్ అయిపోయింది. ఏపీకి ఒక్క కేంద్రమంత్రి కూడా లేకపోవడం వల్ల… రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి పట్టించుకునేవారు కరవయ్యారు. ఈ అసమానతను ఈ సారి విస్తరణలో అయినా ప్రధానమంత్రి సరి చేస్తారో లేదో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close