ప్రిథ్వీ-2 మిస్సైల్ పరీక్ష విజయవంతం

డిఫెన్స్ రీసెర్చ్ మరియు అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ.) తయారుచేసిన ప్రిథ్వీ-2 మిస్సైల్ భారత ఆర్మీ అమ్ములపొదిలో ఒక ముఖ్యమయిన అస్త్రం. దీనిని 2003లో భారత ఆర్మీకి అప్పగించారు. అప్పటి నుండి దానిని భారత ఆర్మీలోని స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్, డి.ఆర్.డి.ఓ. అధికారులు కలిసి అపుడప్పుడు ప్రయోగించి దాని సామార్ధ్యాన్ని, యుద్ద సన్నదతను పరీక్షించి చూసుకొంటున్నారు. అదే సమయంలో దానిని ఏవిధంగా ప్రయోగించాలనే విషయంలో సంబంధిత అధికారులు శిక్షణ పొందుతుంటారు. ఆర్మీకి అందించిన ఈ రకానికి చెందిన అనేక మిసైళ్ళలో నుండి ఏదో ఒకదానిని తీసుకొని ఈవిధంగా పరీక్షించి చూసుకొంటారు. తద్వారా తమ వద్ద అన్ని మిసైల్స్ యుద్ద సన్నదత కలిగి ఉన్నాయని దృవీకరించుకొంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన దానిని పరీక్షించి చూసారు. మళ్ళీ ఈరోజు ఓడిశాలోని చాంద్ పూర్ సమీపంలో గల మిసైల్ టెస్ట్ రేంజ్ నుండి మధ్యాహ్నం 12.10 గంటలకు పరీక్షించి చూసారు. ఆ పరీక్షలో అది నూటికి నూరు శాతం విజయవంతం సాధించిందని అధికారులు తెలిపారు.

ఈ క్షిపణి ప్రత్యేకతలు ఏమిటంటే: ఇది సుమారు 350 కిమీ దూరంలో లక్ష్యాలను అవలీలగా చేదించగలదు. 500-1000 కేజీలు బరువున్న అణ్వస్త్రాలను మోసుకుపోగలదు. లక్ష్యాన్ని బట్టి తన దిశను మార్చుకోగలదు. ఇది ఉపరితలం నుండి ఉపరితలంపైకి అంటే ‘సర్ఫేస్ టు సర్ఫేస్’ ప్రయోగించే అత్యంత శక్తివంతమయిన ఆయుధం. దీనికి ద్రవ ఇంధనంతో నడిచే రెండు అత్యంత శక్తివంతమయిన ఇంజన్లు ఉంటాయి. ఇది పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఇంతవరకు జరిపిన పరీక్షలలో నూటికి నూరు శాతం విజయాలు సాధించింది.

ఈరోజు పృథ్వీ-2 మిసైల్ ను ప్రయోగించిన తరువాత ఓడిశా సముద్ర తీరం వెంబడి ఏర్పాటు చేసిన మిసైల్ ట్రాకింగ్ రాడార్స్, ఎలెక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్స్, టెలి మెట్రీ వ్యవస్థలు దాని గమనమ, వేగం తదితర నిర్దేశిత సాంకేతిక అంశాలను అన్నిటినీ నిశితంగా గమనించాయి. అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన ఒక నిర్దేశిత లక్ష్యాన్ని అది ఛేదిస్తున్నపుడు దానికి కొంత దూరంలో ఒక షిప్పులో నుండి దానిని పరిశీలించిన ఆర్మీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేసారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close