చిరుకి రూ.5 వేలు ఇచ్చి ఆదుకున్న నిర్మాత‌

ఇప్పుడంటే చిరంజీవి మెగా స్టార్‌. ఆయ‌న ఇల్లు.. హీరోల ఫ్యాక్ట‌రీ. చిరు సినిమా అంటే క‌ళ్లు మూసుకుని వంద కోట్ల వ్యాపారం జ‌రిగిపోతుంటుంది. వేల కోట్ల‌కు అధిప‌తి. అయితే… ఒక‌ప్పుడు ఆయ‌న కూడా రూపాయి రూపాయికి త‌డుముకున్న‌వాడే. చాలా ఏళ్లు మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవితం గ‌డిపిన వ్య‌క్తి. అలాంటి చిరు ఓసారి డ‌బ్బుల‌కు తెగ ఇబ్బంది ప‌డిపోయాడ‌ట‌. ఎవ‌రైనా అప్పుగా రూ.5 వేలు ఇస్తే బాగుణ్ణు అని త‌న‌కు తెలిసిన ప్ర‌తీ ఒక్క‌రినీ అడిగాడ‌ట‌. కానీ ఎవ్వ‌రూ ఇవ్వ‌లేద‌ట. ఆ స‌మ‌యంలో ఎమ్మెస్ రాజు ఆదుకున్నాడ‌ట‌. ఎమ్మెస్ రాజు అప్ప‌టికి చిరుతో సినిమాలేం చేయ‌లేదు. అయినా స‌రే, చిరుపై న‌మ్మ‌కంతో రూ.5 వేలు ఇచ్చార‌ట‌. ఇదంతా చ‌ర‌ణ్ పుట్ట‌క ముందు జ‌రిగిన క‌థ‌. ఈ విష‌యాన్ని ‘హ్యాపీ వెడ్డింగ్‌’ ప్రీ రిలీజ్ వేడుక‌లో గుర్తు చేసుకున్నాడు చ‌ర‌ణ్‌. ఈ కార్య‌క్ర‌మానికి నేను రావ‌డం నా బాధ్య‌త‌.. దానికి కార‌ణం ఇదీ… అంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయాడు. ”చిత్ర సీమ‌లో రాణించాలంటే ప్ర‌తిభ మాత్ర‌మే స‌రిపోదు. మంచిత‌నం కూడా ఉండాలి. మంచి త‌నం ఉంటే.. ప్ర‌తిభ లేక‌పోయినా ఏదో ఓ రోజు రాణిస్తారు. ఎమ్మెస్ రాజు కుటుంబం సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నా” అని చ‌ర‌ణ్ విష్ చేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close