ఫృధ్వీ ..భార్యకు నెలకు రూ. 8 లక్షలు చెల్లించాల్సిందే !

సినీ నటుడు ధర్టీ ఇయర్స్ ఫృధ్వీకి కోర్టు షాకిచ్చింది. ఆయన తన భార్యకు నెలకు రూ.ఎనిమిది లక్షల భరణం చెల్లించాల్సిందేనని విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. సినిమాల్లో అవకాశాల కోసం ఆయన భార్య కుటుంబం నుంచి ఆర్థిక సాయం పొందారు. సినిమాల్లో స్థిరపడిన తర్వాత భార్యను వదిలేశారు. దాంతో ఆమె విజయవాడ కోర్టులో కేసు వేసింది. విచారణ జరిపిన కోర్టు.. నెలకు రూ. ఎనిమది లక్షల భరణాన్ని ప్రతీ నెలా పదో తేదీ లోపు ఇవ్వాలని ఆదేశించింది.

ఫృధ్వీక ఇది దెబ్బ మీద దెబ్బ. ఎందుకంటే సినిమాల్లో మంచి ఊపు మీద ఉన్న సమయంలో ఆయన రాజకీయంలో వేలు పెట్టారు. ఆ రాజకీయం కూడా డీసెంట్‌గా చేయలేదు. సినిమా ఇండస్ట్రీలోని పెద్దలందరినీ దూషించారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. చివరికి ఎవరిని మెప్పించేందుకు అలా చేశారో వాళ్లే ఆయనకు వైసీపీలో చేటు లేకుండా చేశారు. ఇప్పుడాయనకు అటు సినిమాల్లేవు.. ఇటు రాజకీయాల్లేవు. రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి మారిపోయింది.

ఇప్పుడు నెలకు రూ. ఎనిమిది లక్షలు భార్యకు కట్టమన ఆదేశించడంతో మరిన్ని చిక్కుల్లో పడిపోయారు. కట్టకపోతే కోర్టు ధిక్కారం అవుతుంది . అవకాశాలు పడిపోయిన ఫృధ్వీకి అంత పెద్ద మొత్తంలో భరణం చెల్లించడం కష్టమే. ఓ తప్పు జీవితాన్ని తలకిందులు చేస్తుందనే విషయం ఫృధ్వీ విషయంలో తేలిపోయింది. రాజకీయాల్లో వేలు పెట్టి వైసీపీ .. ట్రాప్‌లో చిక్కుకోకపోతే.. కనీసం ఆయన సినిమాల్లో అయినా బిజీగా ఉండేవారు. ఇప్పుడు పూర్తిగా నష్టపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close