స్నేహం కోసమే ఇదంతా – రత్నవేలు

స్టార్ డైరక్టర్ సుకుమార్ కు సడెన్ గా నిర్మాతగా మారాలనే ఆలోచన వచ్చింది .. అనుకున్నట్టుగానే కుమారి కథ రాసుకుని తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న సూర్య ప్రతాప్ ని డైరక్టర్ గా చేసి సినిమా స్టార్ట్ చేసేశాడు. అయితే సినిమాకు కెమెరా మెన్ గా తనకు ‘ఆర్య’, ‘1 నేనొక్కడినే’ సినిమాలకు పనిచేసిన క్రేజీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుని కన్సల్ట్ చేశాడు. రోబో లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కెమెరా మెన్ గా పనిచేసిన రత్నవేలు కుమారి సినిమాను ఒప్పుకున్నారు.

కుమారి సినిమాకు కెమెరా మెన్ గా చేయడమే కాదు సినిమాకు గాను రెమ్యునరేషన్ గా చిల్లి గవ్వ కూడా ఆశించలేదు. ఏంటి నిజమా సుకుమార్ సినిమా కోసం భారతదేశం గర్వించే కెమెరా మెన్ రత్నవేలు రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేశారా అంటే.. నిజమే అని చెబుతున్నాయి కుమారి చిత్ర యూనిట్. కేవలం సుకుమార్ మీద ఉన్న అభిమానం తోనే ఈ సినిమా తీశా తప్ప డబ్బు ఆశించి కాదు అని కుమారి 21ఎఫ్ ప్రమోషన్స్ లో రత్నవేలు వివరణ ఇచ్చాడు.

అంతేకాదు సుక్కు సినిమాలకు సంగీతం అందించే దేవి శ్రీ ప్రసాద్ కూడా కుమారి 21ఎఫ్ సినిమాకు ఎటువంటి రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదట. ఇన్ని అద్భుతాలు జరుగబట్టే కుమారి 21ఎఫ్ సినిమా అంత భారీ స్థాయికి చేరుకుంది. చూడ్డానికి చిన్న సినిమానే అయినా చాలా గొప్ప టాలెంట్ ఉన్న వారు సినిమాకు పని చేయడం జరిగింది. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించి కుమారి 21ఎఫ్ సినిమా రేపు గ్రాండ్ రిలీజ్ అవుతుంది. మరి సుకుమార్ రైటింగ్స్ అండ్ సుకుమార్ ప్రొడక్షన్స్ నుండి వస్తున్న ఈ తొలి సినిమా తనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close