చిరుతో మ‌ళ్లీ ప‌నిచేయాల‌నివుందట‌

చిరంజీవి 150వ సినిమా కోస చాలా మంది క‌ర్చీఫ్ లు వేశారు. అయితే వాళ్ల‌లో కొంత‌మందికే అవ‌కాశం ద‌క్కింది. ఇప్పుడు 151వ సినిమా వంతు వ‌చ్చింది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం కూడా క‌ర్చీఫ్‌లు సిద్ధ‌మైపోతున్నాయి. చిరు అభిమాని, ఆయ‌న‌కు ఇష్టుడు లారెన్స్ కూడా ఓ కర్చీఫ్ వేశాడు. చిరుతో మ‌ళ్లీ ప‌నిచేయాల‌నివుంది అంటున్నాడు ఈ డాన్స్ మాస్ట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ క‌మ్ యాక్ట‌ర్‌. ”చిరు అన్న‌య్య 150వ సినిమా చేస్తున్న‌ప్పుడు అన్న‌య్య నుంచి నాకు ఫోన్ వ‌చ్చింది. ‘నేను చిరంజీవి మాట్లాడుతున్నా.. త‌మ‌రి అప్పాయింట్ మెంట్ కావాలి’ అంటూ అన్న‌య్య గొంతు వినిపించింది. అన్న‌య్య అడ‌గ్గానే వ‌చ్చి ర‌త్తాలు ర‌త్తాలు పాట‌కు డాన్స్ కంపోజ్ చేశా. ఆ పాట చాలా హిట్ అయ్యింది. చిరు అన్న‌య్య మ‌రిన్ని సినిమాలు చేయాలి.. ఆయ‌న‌తో మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌ని చేయాల‌నివుంది” అంటున్నాడు లారెన్స్‌.

త‌ను క‌థానాయ‌కుడిగా న‌టించిన శివ‌గంగ ఈ శుక్ర‌వారం విడుద‌ల అవుతుంది. ఈ సినిమాపై చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు లారెన్స్‌. ”సాధార‌ణంగా మ‌న సినిమాల్లో సినిమా మొద‌లైన పావుగంట‌కు గానీ క‌థ మొద‌ల‌వ్వ‌దు. `శివ‌గంగ` అలా కాదు. సినిమాలోని తొలి స‌న్నివేశంతోనే క‌థ చెబుతున్నాం. ఈ సినిమాలో హీరో నేను కాదు. రితికా సింగ్. విశ్రాంతి స‌న్నివేశంలో ఆమె న‌ట‌న గురించి అంద‌రూ మాట్లాడుకొంటారు. అంత అద్భుతంగా న‌టించింది” అంటున్నాడు లారెన్స్‌. గంగ త‌ర‌వాత లారెన్స్ నుంచి ఓ సినిమా రావ‌డం ఇదే. దాంతో ఈసినిమాపై చాలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి వాటిని శివ‌గంగ ఎంత వ‌ర‌కూ అందుకొంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close